డ్యామిడ్.. జగన్ బ్యాండేజీ కథ అడ్డం తిరిగిందన్న టీడీపీ.. లోకేష్ సంచలన పోస్ట్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒక పార్టీపై ఒకటి తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా దాడికి దిగుతున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విజయవాడలో రాయి దాడి ఘటన జరిగిన తర్వాత, ఆ గాయానికి కుట్లు పడ్డాయని, బ్యాండేజ్ వేసుకుని జగన్ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్న విషయం తెలిసిందే.
జగన్ బ్యాండేజ్ పై రచ్చ
అయితే సోషల్ మీడియా వేదికగా జగన్ బ్యాండేజ్ వేసుకుని కనిపించడం పైన మీమ్స్ మోత మోగుతున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి మద్దతుగా ఉన్న కొందరు ముఖాలకు బ్యాండేజ్ లు వేసుకొని సోషల్ మీడియాలో జగన్ ను తమదైన శైలిలో ఎద్దేవా చేశారు. జగన్ సోదరి సునీత జగన్ బ్యాండేజ్ విషయంలో సలహా ఇచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దీనిపైన రచ్చ కొనసాగింది.

జగన్ బ్యాండేజ్ విషయంలో సునీత వ్యాఖ్యలే హైలైట్
దీంతో తాజాగా జగన్ బ్యాండేజ్ తీసేయడంతో టిడిపి జగన్ తీరును ట్రోల్ చేస్తుంది. బ్యాండేజ్ వేసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్ కు ఆయన సోదరి డాక్టర్ సునీత జగన్ కు గాయం కావడం దురదృష్టకరమని అంటూనే, వైద్య పరంగా ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని, గాయం లేనప్పుడు ఎక్కువ రోజులు పాటు బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదన్నారు. దానివల్ల సెప్టిక్ అయ్యి గాయం ఇంకా పెద్దది అవుతుందన్నారు.
బ్యాండేజ్ తీసేసిన జగన్.. టీడీపీ సెటైర్లు
గాయాన్ని మామూలుగా గాలికి వదిలేస్తే అది త్వరగా మానుతుంది అని చెప్పారు. ఓ డాక్టర్ గా బ్యాండేజ్ తీసేస్తే మంచిదని తాను సలహా ఇస్తున్నాను అని సునీత చెప్పారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు జగన్ బ్యాండేజ్ తీసేసారు. దీంతో టీడీపీ డామిడ్.. బ్యాండేజీ కథ అడ్డం తిరిగింది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది.
డామిట్.. బ్యాండేజీ కథ అడ్డం తిరిగింది! #KodiKathiKamalHassan#KodiKathiDrama2 #AndhraPradesh pic.twitter.com/bDuPVWMTtT
— Telugu Desam Party (@JaiTDP) April 27, 2024
మచ్చ కూడా లేదే... టీడీపీ ఆశ్చర్యం
అంతేకాదు బ్యాండేజి పోయింది... కనీసం బుర్ర మీద మచ్చ కూడా లేదు.. కుట్లు వేస్తే, కనీసం ఆ ఆనవాళ్ళు కూడా లేవు అంటూ పోస్ట్ చేసింది.జగన్ గాయం తాలూకా చిన్న మచ్చ కూడా ఆయన ముఖం మీద లేకపోవడంతో ఇదేలా సాధ్యం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం ... జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం 🤕😂#KodiKathiKamalHassan#KodiKathiDrama2 pic.twitter.com/TDfTC7Vb4k
— Lokesh Nara (@naralokesh) April 27, 2024
జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం: లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా జగన్ బ్యాండేజ్ పై పోస్టు పెట్టారు. ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం, జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం అంటూ ఆయన జగన్ ఫోటోలతో పోస్టులు పెట్టారు. మొత్తానికి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి ఏ చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు ఏపీ పొలిటిషియన్స్.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
RDT: ఫలించిన మంత్రి లోకేష్ మంత్రాంగం-మళ్లీ మొదలైన ఆర్డీటీ సేవా ప్రస్థానం..!! -
రాజకీయ వారసురాలు.. గ్లామర్ తార.. రామ్చరణ్ బ్యూటీని చుట్టుముట్టిన వివాదం! -
ఈ బొమ్మల్లో నిజమైన "గుడ్లగూబ" ఎక్కడుందో కనిపెట్టగలరా..? -
మీ కళ్లు ఎంత షార్ప్.. ఈ సంఖ్యల్లో వేరుగా ఉన్న దాన్ని కనిపెట్టగలరా ?? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications