టీడీపీ ఎంపీలకు విప్: బాబు-జగన్లకు ఝలక్.. అవిశ్వాసానికి టీఆర్ఎస్ నో!
అమరావతి: పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు ఎంపీలు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని టీడీపీ విప్ జారీ చేసింది.
విభజన హామీలు అమలు చేయకపోవడం, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ఎన్డీయే ప్రభుత్వంపై టీడీపీ శుక్రవారం అవిశ్వాసతీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.

సభ ఆర్డర్లో లేకపోవడంతో అవిశ్వాస తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ పెట్టిన అవిశ్వాసం సోమవారం సభ ముందుకు వచ్చే అవకాశముంది. ఇప్పటికే కాంగ్రెస్, లెఫ్ట్, ఎస్పీ, బీఎస్పీలతో పాటు వివిధ పార్టీలు మద్దతు ప్రకటించాయి.
ఇదిలా ఉండగా, టీడీపీ, వైసీపీల అవిశ్వాస తీర్మానం రాజకీయ కోణమని టీఆర్ఎస్ చెబుతోంది. అవిశ్వాసానికి టీఆర్ఎస్ మద్దతిచ్చే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications