స్పీకర్గా కోడెల: ముందు బాబు, వెనక జగన్(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే స్పీకర్గా కోడెల ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ పతివాడ నారాయణస్వామి నాయుడు సభలో ప్రకటించారు. అనంతరం స్పీకర్గా కోడెల బాధ్యతలు స్వీకరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి, ఇతర పార్టీ నేతలు వెంట రాగా స్పీకర్ పీఠంపై కోడెల ఆశీనులయ్యారు. స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన కోడెలకు సిఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర మంత్రులు, అన్ని పార్టీల నేతలు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి స్పీకర్గా కోడెల శివప్రసాద్ ఎన్నిక కావడం ఎంతో గర్వకారణమని సిఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. శుక్రవారం ఉదయం ఏపీస్పీకర్గా కోడెల బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనతో ఉన్న అనుబంధాన్ని బాబు గుర్తుచేసుకున్నారు.
స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన కోడెలకు జగన్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభా నిర్వహనకు తాము సహకరిస్తామన్నారు. ప్రజాస్వామం ఓ బండి అయితే పాలక పక్షం ఓ చక్రం, ప్రతి పక్షం రెండో చక్రమని అలాంటి బండికి స్పీకర్ ఓ ఇరుసులాంటి వారు అని జగన్ తెలిపారు.
కోడెలకు బాబు, జగన్ అభినందనలు
ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి, ఇతర పార్టీ నేతలు వెంట రాగా స్పీకర్ పీఠంపై కోడెల ఆశీనులయ్యారు.
ఏపి అసెంబ్లీ
శుక్రవారం ఉదయం ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే స్పీకర్గా కోడెల ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ పతివాడ నారాయణస్వామి నాయుడు సభలో ప్రకటించారు. అనంతరం స్పీకర్గా కోడెల బాధ్యతలు స్వీకరించారు.
ఏపి అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి స్పీకర్గా కోడెల శివప్రసాద్ ఎన్నిక కావడం ఎంతో గర్వకారణమని సిఎం చంద్రబాబు నాయుడు అభినందించారు.
ఏపి అసెంబ్లీ
స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన కోడెలకు సిఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర మంత్రులు, అన్ని పార్టీల నేతలు అభినందనలు తెలిపారు.
కోడెలకు అభినందనలు
శుక్రవారం ఉదయం ఏపీస్పీకర్గా కోడెల బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనతో ఉన్న అనుబంధాన్ని బాబు గుర్తుచేసుకున్నారు.
కోడెలకు అభినందనలు
సమైక్యరాష్ట్రంలో అనేక మంత్రిపదవులు చేపట్టిన కోడెల ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చారని బాబు కొనియాడారు.
కోడెలకు అభినందనలు
స్పీకర్ కోడెలకు అభినందనలు తెలుపుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి.
కుటుంబ సభ్యులతో..
వైద్యుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, రైతు నాయకుడిగా సమాజం కోసం ఎనలేని కృషి చేశారని చంద్రబాబు కొనియాడారు.
కోడెలకు అభినందనలు
తెలుగు జాతి ఆత్మగౌరవానికి కృషి చేసిన ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు కోడెల అంటే ఎంతో అభిమానమని చంద్రబాబు అన్నారు.
కోడెలకు యనమల అభినందనలు
స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన కోడెలకు అభినందనలు తెలుపుతున్న మంత్రి యనమల రామకృష్ణుడు.
జగన్ అభినందనలు
సభలో సుదీర్ఘ అనుభవం గల నాయకుడు కోడెల అని ప్రతిపక్ష నేత వైసిసి అధినేత జగన్ అన్నారు. అధికార పక్షం నుంచి వచ్చాననే భావన మదిలో ఉండకూడదన్నారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి స్పీకర్గా కోడెల శివప్రసాద్ ఎన్నిక కావడం ఎంతో గర్వకారణమని సిఎం చంద్రబాబు నాయుడు అభినందించారు.
స్పీకర్ కోడెల
శుక్రవారం ఉదయం ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే స్పీకర్గా కోడెల ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ పతివాడ నారాయణస్వామి నాయుడు సభలో ప్రకటించారు. అనంతరం స్పీకర్గా కోడెల బాధ్యతలు స్వీకరించారు.