రాసలీలల రాంబాబూ! అదుపులో ఉండు: టిడిపి నేత, జగన్పై ఆగ్రహం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, ఆ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు పైన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మం చౌదరి శుక్రవారం నాడు మండిపడ్డారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, ఆ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు పైన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మం చౌదరి శుక్రవారం నాడు మండిపడ్డారు.
ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. వీటిపై జగన్ చర్చకు రావాలన్నారు. అంబటిపై తీవ్ర విమర్శలు చేశారు. రాసలీలల అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తమ పార్టీ యువనేత నారా లోకేష్ను విమర్శిస్తే సహించేది లేదన్నారు.
అప్పటిదాకా విశ్రాంతి లేదు
నోట్ల రద్దు వ్యవహారంలో ప్రజలకు ఉపశమనం కలిగేంత వరకు బ్యాంకులు, అధికారులు అవిశ్రాంతంగా పని చేయాలని, అప్పటిదాకా విశ్రాంతి లేదని ఏపీ సీఎం చంద్రబాబుఅన్నారు. పెద్ద నోట్లు రద్దయి నలభై రోజులు దాటినా ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారన్నారు.
జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లు, ఇరత ఉన్నతాధికారులతో క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగదు పంపిణీలో పింఛనుదారులు, ఉపాధి కూలీలు, పాల ఉత్పత్తిదారులు, రైతులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు.
ప్రతి నెలా రూ.వెయ్యి కోట్లు ఉపాధి కూలీలకు, పింఛనుదారులకు కేటాయించాలని స్పష్టం చేశారు.పెద్ద నోట్ల రద్దు ప్రభావం వృద్ధిరేటుపై పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సేవలు, పరిశ్రమల రంగం వృద్ధి కూడా తగ్గకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి మండలంలోని ఓ గ్రామాన్ని నగదు రహితంగా తీర్చిదిద్దాలని. మిగిలిన గ్రామాలు ఆ గ్రామాన్ని అనుసరించేలా చూడాలన్నారు.