చంద్రబాబుపై తీవ్ర విమర్శలు: సోము వీర్రాజు వీడియో ట్వీట్పై పనబాక లక్ష్మి స్పందన
అమరావతి: తిరుపతి లోక్సభ ఉపఎన్నికల సమయంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సోషల్ మీడియాలో షేర్ చేసిన చర్చనీయాంశంగా మారింది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి పనబాక లక్ష్మి చేసిన కామెంట్లు ఆ వీడియోలో ఉన్నాయి.
ప్రస్తుతం టీడీపీ అభ్యర్తిగా బరిలోకి దిగిన పనబాక లక్ష్మి.. ఆ వీడియోపై స్పందించారు. తనపై సోము వీర్రాజు పోస్టు చేసిన వీడియో మార్ఫింగ్ చేసిందని, ఆ వీడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
అంతేగాక, ఆ వీడియోను సోషల్ మీడియాలో, చిన్న ఫోన్లలోనే కాదు, 70 ఎంఎం స్క్రీన్ మీద కూడా సోము వీర్రాజు వేసుకోవచ్చని పనబాక లక్ష్మి కౌంటర్ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచీ ఎవరిని పల్లెత్తు మాట కూడా అనలేదని వివరణ ఇచ్చారు.
ఆ వీడియోపై తాను పార్టీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమ వెంట ప్రజలు ఉన్నారని, అది తమకు చాలని ఆమె వ్యాఖ్యానించారు. అనలేదని వివరణ ఇచ్చిన పనబాక లక్ష్మి.. మా వెంట ప్రజలు ఉన్నారు... అది మాకు చాలు అన్నారు.. ఆ వీడియోపై నేను పార్టీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు పనబాక లక్ష్మి. తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి గురుమూర్తి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ బరిలో ఉన్నారు.
తిరుపతి ఎంపీ అభ్యర్థి శ్రీమతి పనబాక లక్ష్మీ గారు టిడిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు @ncbn గారిని వర్ణించిన సన్నివేశం మీ కోసం.. సమర్పిస్తున్న తెలుగుదేశం @JaiTDP.#BJP4Tirupati#BJP_JanaSena4AndhraPradesh@PanabakaLakshmi pic.twitter.com/t5Q5zJj6hz
— Somu Veerraju (@somuveerraju) March 30, 2021
కాగా, సోము వీర్రాజు పోస్టు చేసిన ఆ వీడియోలో పనబాక లక్ష్మి.. చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు అనకొండలు కనిపించలేదా? అని అన్నారు. అసలు చంద్రబాబు నాయుడు రాజకీయాలకు ఎలా వచ్చారంటూ ప్రశ్నించారు. మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారంటూ తీవ్ర విమర్శలు చేశారు.