సీఎస్, డీజీపీని టార్గెట్ చేస్తున్న టీడీపీ - వాట్ నెక్స్ట్..!!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం పై ఒత్తిడి పెరుగుతోంది. ఏపీలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార డిమాండ్ చేసారు. ప్రజలను ఇబ్బందికి గురి చేసి ప్రతిపక్షాలపై నెట్టే ప్రయత్నం జగన్ చేస్తున్నారని మండిపడ్డారు. పెన్షనర్లలను వైసీపీ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. కుటిల బుద్ధితో వైసీపీ రాజకీయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారుచీఫ్ సెక్రటరీ, డీజీపీ జగన్ బాటలో నడుస్తున్నారని ఆరోపించారు.
గెలుపు పై ధీమా
మళ్ళీ జగన్ గెలుస్తే ఏపీలో శాంతి భద్రతలు, ప్రజల ఆస్తులు ఉండవని వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు నిర్భయంగా బయటకు వచ్చి ఓట్లు వేయాలని కోరారు. ఏపీలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతాయా లేదని ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. ఎన్డీఏ కూటమి ఏపీలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో స్పెషల్ ప్రొటెక్షన్తో ఎన్నికలు జరిపించాలన్నారు. రాష్ట్రంలో 14 నియోజకవర్గాలు సమస్యాత్మక ప్రాంతాలని ఈసీ చెప్పిందని.. అందులో పులివెందుల, కుప్పం లేవన్నారు. కుప్పంలో కూడా ఎన్నికలు సజావుగా జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలన్నారు.

ఈసీ చర్యలు తీసుకోవాలి
కుప్పంలో వైసీపీ నేతలు గొడవలు సృష్టించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారులే కాకుండా కేంద్ర ఎన్నికల అధికారులు కూడా పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేయాలని మాజీ ఎంపీ వినతి చేశారు. ఏపీ లో శాంతి భద్రతలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని గతంలో ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం గత ఐదేళ్ల నుంచి చూశామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కూడా కేసులు పెట్టారన్నారు. నోటిఫికేషన్ తర్వాత చీఫ్ సెక్రెటరీ, డీజీపీ, అధికారులు అందరూ ఎన్నికల సంఘం అధీనంలో ఉండాలన్నారు.

జగన్ కింద పని చేస్తున్నారు
ఎన్నికల కమిషన్ కింద అధికారులు పని చేయకుండా జగన్ కింద పని చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు పారదర్శకంగా జరపాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. వందల మంది వైసీపీ నేతలు.. ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తున్నారన్నారు. రాజకీయ హత్యలకు కూడా వైసీపీ నేతలు పాల్పడుతున్నారని తెలిపారు. గతంలో ప్రధాన మంత్రి సభ సజావుగా జరగకుండా చేశారన్నారు. పోలీసులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కనకమేడల రవీంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications