నంద్యాలపై బాబు, ఎక్కడ ఎంత మెజార్టీ అంటే? శిల్పా ఇంటిపరిసరాల్లోను టిడిపిదే
నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. అభివృద్ధి, సంక్షేమానికి నంద్యాల ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పారు.
నంద్యాలలో టిడిపి గెలుపుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు అన్ని వర్గాల ప్రజలు టిడిపిని ఆదరించారని, ఈ విజయం అభివృద్ధికి నిదర్శనమన్నారు.

జగన్ వ్యాఖ్యలు ఆందోళన కలిగించాయి: చంద్రబాబు
నంద్యాలలో జగన్ పదిహేను రోజుల పాటు బస చేసి ప్రలోభాలకు పాల్పడినా ప్రజలు వైసిపిని తిరస్కరించారని చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై కాల్చేయాలి, ఉరితీయాలి అని జగన్ చేసి వ్యాఖ్యలు ప్రజల్లో ఆందోళన కలిగించాయన్నారు.
Recommended Video


శాశ్వతంగా అధికారంలో ఉండేలా
నంద్యాల ఫలితం రాబోయే ఎన్నికలకు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. అవినీతిని నిర్మూలించి ప్రజలు మెచ్చుకునే పాలన అందించి టిడిపి శాశ్వతంగా అధికారంలో ఉండేలా చేస్తామని చెప్పారు.

టిడిపికి ఎక్కడ ఎంత మెజార్టీ అంటే
నంద్యాలలో టిడిపి ఒక్క 16వ రౌండ్ మినహా అన్ని రౌండ్లలోను ఆధిక్యత ప్రదర్శించింది. అన్ని ప్రాంతాల్లో మెజార్టీ ఓట్లు సాధించింది. నంద్యాల రూరల్లో 13,056 ఓట్ల మెజార్టీ, అర్బన్లో 12,309 ఓట్ల మెజార్టీ, గోస్పాడులో 1788 ఓట్ల మెజార్టీ సాధించింది.

శిల్పా మోహన్ రెడ్డి ఇంటి పరిసరాల్లోను టిడిపిదే
నంద్యాల అర్బన్లో శిల్పా మోహన్ రెడ్డి ఇంటి పరిసరాల్లోనూ టిడిపి ఆధిక్యం కనబర్చడం విశేషం. ఇక్కడ కూడా టిడిపి ఎక్కువ ఓట్లు రాబట్టడం గమనార్హం.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications