పవన్,జగన్ పై ట్విట్టర్ లో...ఆ పికేనే ఈ పికే దగ్గరకు:ఎంపి గల్లా జయదేవ్ మరో బాంబ్
గుంటూరు:ఇటీవల ట్విట్టర్ వేదికగా ప్రత్యర్థి పార్టీల అధినేతలపై పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లతో ఆరోపణా అస్త్రాలు సంధిస్తున్న గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ మరోసారి విపక్ష నేతలపై తన ట్వీట్ల దాడి చేశాడు.
ఇటీవలే మోడీ-షా డైరెక్షన్లో "జగన్-పవన్" సినిమా అంటూ సంచలనం సృష్టించిన ఎంపీ జయదేవ్ తాజాగా మరో బాంబు పేల్చాడు. "జగన్-పవన్" కుట్ర ఇంకా ముగియలేదన్నాడు. ఇదిగో బీజేపీ, వైసీపీ, జనసేనల బంధానికి రుజువు అంటూ జనసేన వ్యూహకర్త దేవ్ పేరును ప్రత్యేకంగా పేర్కొన్నాడు. వైసీపీ, బీజేపీలకు వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిశోర్ శిష్యుడే ఈ దేవ్ అని చెప్పారు.
అంతేకాదు పవన్ కళ్యాణ్ దగ్గరకు ప్రశాంత్ కిషోరే పంపించాడని ఎంపి గల్లా ట్విట్టర్ లో ఆరోపించారు. ఇక పవన్కు ఈ దేవ్ వ్యూహకర్తగా పని చేయనున్నాడని ట్వీట్ చేశారు. ఎంపీ గల్లా జయదేవ్ సంధించిన ఈ ట్వీట్ తక్కువ వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దేవ్ను తమ పార్టీ వ్యూహకర్తగా నియమిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో ఎంపీ గల్లా జయదేవ్ తాజా ఆరోపణలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ హఠాత్తుగా దేవ్ అనే వ్యక్తిని వ్యూహకర్తగా నియమించడం పై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో ఎంపి గల్లా జయదేవ్ చేసిన తీవ్ర ఆరోపణలతో ఇక ఈ అంశం మరింత వేడెక్కనుంది. మరోవైపు టీడీపీ, జనసేనల మధ్య సోషల్ మీడియా వేదికగా ఆరోపణల, విమర్శల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండుపార్టీల మద్ధతుదారులు తమ ప్రత్యర్థులపై తమదైన శైలిలో దాడులు చేస్తున్న తరుణంలో టిడిపి తరుపున ఎంపి గల్లా జయదేవ్ తన పదునైన ట్వీట్లతో ప్రత్యర్థులని టార్గెట్ చేస్తుండటం ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్తేజాన్ని కలిగిస్తోంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ దగ్గరకు ప్రశాంత్ కిషోరే పంపించాడని ఎంపి గల్లా ట్విట్టర్ లో ఆరోపించారు. ఇక పవన్కు ఈ దేవ్ వ్యూహకర్తగా పని చేయనున్నాడని ట్వీట్ చేశారు.