టీడీపీ ఎంపీ కేశినేని నానీకి కేంద్రంలో మరో కీలక పదవి .. రీజన్ ఇదేనా ?
టీడీపీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి కేంద్రం నుంచి ప్రతిష్ఠాత్మక పదవి లభించింది. గతంలోకూడా నానీకి పార్లమెంట్ అంచనాల కమిటీ సభ్యుడిగా అవకాశం ఇచ్చింది కేంద్ర సర్కార్ . ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన మరో కీలక పదవిని ఇచ్చింది. అసలు టీడీపీ అంటేనే గిట్టని కేంద్ర సర్కార్ నానీకి ఎందుకు ఇలా బంపర్ ఆఫర్స్ ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీ సభ్యుడిగా కేశినేని నానీ
కేంద్ర సర్కార్ కేశినేని నానీకి కీలక పదవినిచ్చింది.కేశినేని నానీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు. దేశంలో ఔషధాల తయారీ, రసాయనాలు,వాటికి సంబంధించిన నిబంధనలు,హక్కులు ఇతర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా,కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యక్రమాలను కూడా కమిటీ పర్యవేక్షించనుంది. అలాంటి కమిటీకి సభ్యుడిగా కేంద్రం బంపర్ ఆఫర్ ఇచ్చింది.

టీడీపీ ఎంపీ కేశినేని నానీకి కీలకపదవి ఇవ్వటంపై ఏపీలో చర్చ
కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకున్న బీజేపీ వ్యూహాలు అర్ధం చేసుకోవటం తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు ఒకింత కష్టంగానే ఉందని చెప్పాలి . తనకు అనువుగా లేని రాష్ట్రాల్లో కూడా పాగా వేసేందుకు పక్కా వ్యూహాలను అమలు చేస్తున్న బీజేపీ ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించింది అన్న విషయం తెలిసిందే . అందులోనూ ఏపీలో ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం నిజంగానే ఆసక్తిని రేకెత్తిస్తోందని చెప్పక తప్పదు.ఇక తాజాగా కేశినేని నానీకి మరోమారు కీలక పదవినిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అయ్యింది.

గతంలో పార్లమెంట్ అంచనాల కమిటీ సభ్యుడిగా అవకాశం
ఈ దఫా కూడా కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ, ఏపీ టీడీపీ సీనియర్ నేత - విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (కేశినేని నాని)ని పార్లమెంటు అంచనాల కమిటీ సభ్యుడిగా అవకాశం ఇవ్వటం, ఇక తాజాగా మళ్ళీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీలో సభ్యుడిగా ఎంపిక చెయ్యటం అంతా ఆపరేషన్ ఆకర్ష్ కోసమేనా అన్న భావన సైతం కలుగుతుంది. టీడీపీలో బలమైన ఎంపీగా ఉన్న కేశినేని నానీకి బీజేపీ మాత్రం సముచిత స్థానం ఇస్తుంది అన్న సంకేతాలు వెళ్ళటం కోసమే నానికి ఆఫర్లు ఇస్తున్నారేమో అన్న చర్చ జరుగుతుంది.

కేశినేని నానీకి బీజేపీపై సానుకూల దృక్పధం పెంచే యత్నం
వరుస ఆఫర్లతో బీజేపీపై సానుకూల దృక్పధం ఏర్పడి నానీ బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం కూడా లేకపోలేదు .ఇప్పటికే ఏపీలో టీడీపీ సమస్యలతో ఎదురీదుతున్న పరిస్థితి. ఇక ఇలాంటి సమయంలో బీజేపీ నానీకి మంచి అవకాశం ఇవ్వటం , నానీని కమల దళంలోకి ఆహ్వానించే ఆలోచననేనా అన్న అనుమానం అందరిలో ఉంది. చూడాలి మరి భవిష్యత్ లో కేశినాని నానీ ఏం చేస్తారో .
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications