వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ ఎంపీ కేశినేని నానీకి కేంద్రంలో మరో కీలక పదవి .. రీజన్ ఇదేనా ?

|
Google Oneindia TeluguNews

టీడీపీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి కేంద్రం నుంచి ప్రతిష్ఠాత్మక పదవి లభించింది. గతంలోకూడా నానీకి పార్లమెంట్ అంచనాల కమిటీ సభ్యుడిగా అవకాశం ఇచ్చింది కేంద్ర సర్కార్ . ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన మరో కీలక పదవిని ఇచ్చింది. అసలు టీడీపీ అంటేనే గిట్టని కేంద్ర సర్కార్ నానీకి ఎందుకు ఇలా బంపర్ ఆఫర్స్ ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది..

వాళ్లకు సిగ్గు శరం లేదు .. మామూలు భాష అర్ధం కాదు .. టీడీపీ నేతలపై కొడాలి నానీ ఘాటు వ్యాఖ్యలువాళ్లకు సిగ్గు శరం లేదు .. మామూలు భాష అర్ధం కాదు .. టీడీపీ నేతలపై కొడాలి నానీ ఘాటు వ్యాఖ్యలు

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీ సభ్యుడిగా కేశినేని నానీ

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీ సభ్యుడిగా కేశినేని నానీ

కేంద్ర సర్కార్ కేశినేని నానీకి కీలక పదవినిచ్చింది.కేశినేని నానీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు. దేశంలో ఔషధాల తయారీ, రసాయనాలు,వాటికి సంబంధించిన నిబంధనలు,హక్కులు ఇతర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా,కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యక్రమాలను కూడా కమిటీ పర్యవేక్షించనుంది. అలాంటి కమిటీకి సభ్యుడిగా కేంద్రం బంపర్ ఆఫర్ ఇచ్చింది.

టీడీపీ ఎంపీ కేశినేని నానీకి కీలకపదవి ఇవ్వటంపై ఏపీలో చర్చ

టీడీపీ ఎంపీ కేశినేని నానీకి కీలకపదవి ఇవ్వటంపై ఏపీలో చర్చ


కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకున్న బీజేపీ వ్యూహాలు అర్ధం చేసుకోవటం తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు ఒకింత కష్టంగానే ఉందని చెప్పాలి . తనకు అనువుగా లేని రాష్ట్రాల్లో కూడా పాగా వేసేందుకు పక్కా వ్యూహాలను అమలు చేస్తున్న బీజేపీ ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించింది అన్న విషయం తెలిసిందే . అందులోనూ ఏపీలో ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం నిజంగానే ఆసక్తిని రేకెత్తిస్తోందని చెప్పక తప్పదు.ఇక తాజాగా కేశినేని నానీకి మరోమారు కీలక పదవినిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అయ్యింది.

 గతంలో పార్లమెంట్ అంచనాల కమిటీ సభ్యుడిగా అవకాశం

గతంలో పార్లమెంట్ అంచనాల కమిటీ సభ్యుడిగా అవకాశం

ఈ దఫా కూడా కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ, ఏపీ టీడీపీ సీనియర్ నేత - విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (కేశినేని నాని)ని పార్లమెంటు అంచనాల కమిటీ సభ్యుడిగా అవకాశం ఇవ్వటం, ఇక తాజాగా మళ్ళీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీలో సభ్యుడిగా ఎంపిక చెయ్యటం అంతా ఆపరేషన్ ఆకర్ష్ కోసమేనా అన్న భావన సైతం కలుగుతుంది. టీడీపీలో బలమైన ఎంపీగా ఉన్న కేశినేని నానీకి బీజేపీ మాత్రం సముచిత స్థానం ఇస్తుంది అన్న సంకేతాలు వెళ్ళటం కోసమే నానికి ఆఫర్లు ఇస్తున్నారేమో అన్న చర్చ జరుగుతుంది.

కేశినేని నానీకి బీజేపీపై సానుకూల దృక్పధం పెంచే యత్నం

కేశినేని నానీకి బీజేపీపై సానుకూల దృక్పధం పెంచే యత్నం

వరుస ఆఫర్లతో బీజేపీపై సానుకూల దృక్పధం ఏర్పడి నానీ బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం కూడా లేకపోలేదు .ఇప్పటికే ఏపీలో టీడీపీ సమస్యలతో ఎదురీదుతున్న పరిస్థితి. ఇక ఇలాంటి సమయంలో బీజేపీ నానీకి మంచి అవకాశం ఇవ్వటం , నానీని కమల దళంలోకి ఆహ్వానించే ఆలోచననేనా అన్న అనుమానం అందరిలో ఉంది. చూడాలి మరి భవిష్యత్ లో కేశినాని నానీ ఏం చేస్తారో .

English summary
Kesineni Nani has been selected as a member of the Indian Council of Medical Research Committee. The Committee oversees the manufacture of pharmaceuticals, chemicals, regulations and rights in the country. The committee will also oversee the activities of the Union Ministry of Health. The Center made a bumper offer as a member of such a committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X