ఎంపీ రామ్మోహన్ నాయుడు పెళ్లి విందుకు బాబు (ఫోటోలు)
ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహ మహోత్సవానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కూతురు శ్రీశ్రావల్యతో పెళ్లి జరుగనుంది.
విశాఖ: ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహ మహోత్సవానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కూతురు శ్రీశ్రావల్యకు, రామ్మోహన్ నాయుడుకు పెళ్లి జరగనుంది.
తెల్లవారుజామున పెళ్లి
గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు పెళ్లి ఉంది. ఈ వివాహ మహోత్సవానికి ముందు ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
వేడుకకు కేంద్రమంత్రులు
ఈ వేడుకలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, సురేష్ ప్రభు హాజరయ్యారు.
రాష్ట్రమంత్రులు
రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, చినరాజప్ప, కళా వెంకట్రావు, కెఎస్ జవహార్, దేవినేని ఉమామహేశ్వర రావు, పరిటాల సునీత, గంటా శ్రీనివాస రావు, నక్కా అనంద్బాబు, కొల్లు రవీంద్ర, సుజయ కృష్ణ రంగారావు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, వధువు తండ్రి బండారు సత్యనారాయణమూర్తి హాజరయ్యారు.
ఎంపీలు
శాసన మండలి ఛైర్మన్ చక్రపాణి, ఎంపీలు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కొనకళ్ల నారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కేశినేని నాని, తదితర ఎంపీలు, మాజీ ఎంపీ నామా నాగేశ్వ రావు, విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్, మాజీ మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్సీలు, హాజరయ్యారు.