మండలిలో టీడీపీ ట్విస్ట్..తీర్మానం: మా ఎమ్మెల్సీలకు ఫోన్లు చేస్తారా: బొత్సా వర్సెస్ యనమల..!
శాసనమండలిలో ప్రారంభంలోనే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సభ ప్రారంభం కాగానే మూడు రాజధానులు..వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన ప్రతిపాదనకు సిద్దమయ్యారు. ఆ సమయంలో ప్రతిపక్ష టీడీపీ నుండి ఊహించని విధంగా కొత్త ప్రతిపాదన ఎదురైంది. బిల్లు కంటే ముందుగా తాము రూల్ 71 మోషన్ కింద నోటీసు ఇచ్చామని..దీని మీద తొలుత చర్చ చేపట్టాలని టీడీపీ పట్టు బట్టింది. ప్రభుత్వ విధానం మొత్తం తప్పుగా వ్యవహరిస్తోందని..దీని మీద చర్చ జరిగిన తరువాతనే బిల్లు మీద చర్చ తీసుకోవాలని మండలిలో ప్రతిపక్ష నేత యనమల డిమాండ్ చేసారు. అయితే, దీనికి మంత్రి బుగ్గన అభ్యంతరం వ్యక్తం చేసారు. అసలు యనమల ప్రస్తావిస్తున్న మోషన్ మండలిలో అమల్లో లేదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో మంత్రులు..టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
రూల్ 71 కింద టీడీపీ నోటీసు..
శాసన మండలిలో ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు ప్రతిపాదనకు సిద్దమైంది. అదే సమయంలొ టీడీపీ నుండి రూల్ 71 మోషన్ కింద నోటీసు ఇచ్చారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని.. ప్రభుత్వ పాలసీని వ్యతిరేకిస్తూ తాము ప్రతిపాదించిన తీర్మానం పైన చర్చ చేపట్టాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఆ తరువాతనే ప్రభుత్వ బిల్లులను చర్చకు తీసుకోవాలని టీడీపీ నేతలు ఛైర్మన్ ను కోరారు. బిల్లుల కంటే ముందుగానే తాము నోటీసు ఇచ్చామని..ముందు దీని పైనే చర్చ చేపట్టాలని బిజినెస్ రూల్స్ చెబుతున్నాయని టీడీపీ నేత యనమల వాదిస్తన్నారు. అయితే, యనమల వాదనతో ప్రభుత్వం విభేదించింది. అసలు ఆ నోటీసు మీద చర్చకు మండలికి అవకాశం లేదని మంత్రి బుగ్గన వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. దీంతో..మండలిలో ఇదే అంశం మీద ఎవరి వాదన వారు కొనసాగిస్తున్నారు.
తామిచ్చిన నోటీసుపై చర్చ జరగాల్సిందేనంటోన్న యనమల.

మా ఎమ్మెల్సీకు ఫోన్లు చేస్తారా..
ఇదే సమయంలో టీడీపీ పక్షనేత యనమల సభా వేదికగా మరో అంశం పైన ప్రభుత్వాన్ని నిలదీసారు. తమ ఎమ్మెల్సీలకు ప్రభుత్వంలోని ముఖ్యులు ఎందుకు ఫోన్లు చేస్తున్నారని యనమల నిలదీసారు. దీనికి కొనసాగింపుగా శాసన మండలిని కించపరిచే విధంగా బొత్స వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని ప్రస్తావించిన యనమల ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. మండలికి క్షమాపణ చెప్పాలని గట్టిగా డిమాండ్ చేసారు. సభలో టీడీపీకి మెజార్టీ ఉండటంతో..ఖచ్చితంగా ప్రభుత్వ ప్రతిపాదించే బిల్లులకు అడ్డంకులు కలిగిస్తుందని అందరూ అంచనాతో ఉన్నారు. అయితే, రూల్ 71 కింద తీర్మానం ప్రతిపాదించ టం..ఇదే సమయంలో బొత్సా ను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా టీడీపీ వ్యూహం అమలు చేస్తోంది. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications