జగన్కు షాక్: పాదయాత్రకు ముందే చెక్, బాబు మైండ్ గేమ్
Recommended Video
అమరావతి:2019 ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకొనే లక్ష్యంతో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రను చేపట్టాలని భావిస్తున్నారు.అయితే జగన్ పాదయాత్రకు ముందే ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేసేలా టిడిపి వ్యూహరచన చేస్తోంది. వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు టిడిపిలో చేరేలా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం వైసీపీకి రాజకీయంగా ఇబ్బందిగా మారుతోంది.
నంద్యాల, కాకినాడ రిజల్ట్స్: మా బలమెంటో తెలిసింది, కానీ.. :చంద్రబాబు
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ టిడిపి ఇదే రకమైన పరిస్థితులను ఎదుర్కొంంది. 2009 నుండి 2014 మధ్య కాలంలో సుమారు 35 మంది టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్, వైసీపీలలో చేరారు.
బుట్టా రేణుకపై వేటు: మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి?
ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీని వీడుతారనే భయం టిడిపి నేతల్లో ఆనాడు ఉండేది. అయితే పార్టీని కాపాడుకొనే ఉద్దేశ్యంతో పాటు పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు చంద్రబాబునాయుడు పాదయాత్రను నిర్వహించారు. బాబు పాదయాత్ర నిర్వహించే సమయంలో కూడ కొందరు పార్టీ నేతలు టిడిపిని వీడారు.
జగన్కు షాక్: భరోసా ఇచ్చిన బాబు, టిడిపిలోకి బుట్టా రేణుక?
ప్రస్తుతం వైసీపీ కూడ దాదాపుగా ఇదే రకమైన పరిస్థితిని ఏపీలో ఎదుర్కొంటోంది. పార్టీ నుండి నేతలు వెళ్ళిపోవడం లాంటి ఘటనలు ఆ పార్టీ శ్రేణల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
ఆ తరహలోనే ప్లాన్
2009 నుండి 2014 మధ్య కాలంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టిడిపికి చెందిన సుమారు 35 మందికిపైగా ఎమ్మెల్యేలు టిడిపి, వైసీపీల్లో చేరారు. తెలంగాణ ప్రాంతంలో టిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమాన్నిసెంటిమెంట్ను అస్త్రంగా ప్రయోగించింది.
మరో వైపు వైసీపీ నాయకత్వం కూడ టిడిపి ఎమమెల్యేలను తమ పార్టీలోకి ఆహ్వనించింది. అత్యంత ఇబ్బందికరపరిస్థితుల్లో టిడిపి చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం పాదయాత్రను నిర్వహించారు.పాదయాత్ర సాగుతున్న సమయంలో కూడ కొందరు ఎమ్మెల్యేలు వైసీపీ, టిఆర్ఎస్ పార్టీల్లో చేరారు.
అదే వ్యూహంతో చంద్రబాబు
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో తమ పార్టీని బలహీనంర్చేందుకు రాజకీయ ప్రత్యర్థులు తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం ఇదే రమైన వ్యూహన్ని టిడిపి నాయకత్వం అనుసరించేందుకు ప్రయత్నాలను సాగిస్తోంది.వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించే నాటికి మరికొందరు నేతలంతా టిడిపిని చేరుకొనే అవకాశాలు కూడ ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. వైసీపీ నేతల మనోస్థర్యాన్ని దెబ్బతీసేందుకు ఈ అవకాశాన్ని టిడిపి ఉపయోగించుకోవాలని భావిస్తోంది.
జగన్ ముందుజాగ్రత్తలు
వైసీపీని వీడాలనే ఆలో,పలో ఉన్న వారిపై పార్టీ కేంద్రీకరించిందిన సమచారం. పార్టీ నుండి బయటకు వెళ్ళాలని భావించిన నేతల ప్రవర్తనపై వైసీపీ నాయకత్వం కూడ పరిశీలిస్తోంది.. బుట్టా రేణుక పార్టీ ని వీడడడానికి జగన్ వైఖరి కూడ కారణమనే అభిప్రాయం కూడ లేకపోలేదు.
చంద్రబాబునాయుడు కూడ సంక్షోభ సమయంలోనే
2009 నుండి 2014 నాటికి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పాదయాత్ర పార్టీని కాపాడుకొనేందుకు ఉపయోగపడింది అంతేకాదు పాదయాత్ర ద్వారా మరో చంద్రబాబునాయుడు ప్రజలకు కన్పించాడనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీని కీలక నేతలు వీడిపోయినా కానీ, 2014 ఎన్నికల సమయంలో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాలు కూడ టిడిపికి కలిసివచ్చాయి అయితే వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఆ పార్టీని మరింత ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా టిడిపి నాయకత్వం వ్యవహరించే అవకాశలు లేకపోలేదంటున్నారు..