సుజనా చౌదరికి ఎసరు: రాజ్యసభకు బాలకృష్ణ, అసెంబ్లీకి నారా లోకేష్?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో పవర్ గేమ్ ఊపందుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. సుజనా చౌదరి ఈసారి రాజ్యసభలోకి అడుగు పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అయితే, అది ఎంత నమ్మశక్యమనేది తెలియడం లేదు. అదే సమయంలో నారా లోకేష్ ఒక దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలని భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. నారా లోకేష్ను రాజ్యసభకు పంపించి, కేంద్ర మంత్రి పదవి వచ్చేలా చూడాలని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చంద్రబాబును బహిరంగంగానే కోరారు.

అయితే, లోకేష్ ఆలోచన మరో రకంగా ఉన్నట్లు చెబుతున్నారు. మామ బాలకృష్ణను రాజ్యసభకు పంపిస్తే అన్ని రకాలుగా తాను అనుకున్నది జరుగుతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. తనకు రాజ్యసభ టికెట్ ఇవ్వాలని నందమూరి హరికృష్ణ ఇప్పటికే దరఖాస్తు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
బాలయ్యను రాజ్యసభకు ప్రతిపాదిస్తే సుజానా చౌదరినీ, హరికృష్ణను ఇద్దరినీ అడ్డుకోవడం సులభమవుతుందని నారా లోకేష్ వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. దీనివల్ల తాను హిందూపురం నుంచి శాసనసభలోకి అడుగు పెట్టి తండ్రి వారసుడిగా చక్రం తిప్పడానికి వీలవుతుందని లోకేష్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద. అధికార రాజకీయాల్లోకి రావాలని నారా లోకేష్ ఉవ్విళ్లూరుతున్నట్లు చెబుతున్నారు.
.
-
చిరంజీవి - బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications