కడప:స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు, జగన్ పార్టీల ఎత్తులు
ఈ నెల 17వ, తేదిన జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందకుగాను టిడిపి తన శక్తియుక్తులను ప్రదర్శిస్తోంది. అయితే వైసిపి కూడ తన పట్టును నిలుపుకొనేందుకు గాను వైసిపి ప్రయత్నిస్తోంది.
కడప:ఈ నెల 17వ, తేదిన జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను టిడిపి తన శక్తియుక్తులను ప్రదర్శిస్తోంది.అయితే వైసిపి మాత్రం తన పట్టును నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది.అయితే టిడిపికి చెందిన ప్రజా ప్రతినిధులతో పుదుచ్చేరిలో ఆ పార్టీ నాయకులు క్యాంప్ నిర్వహిస్తున్నారు.
ఈ నెల 17వ, తేదిన కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను అన్ని రకాల వ్యూహలను టిడిపి అనుసరిస్తోంది. వైసిపి మాత్రం తన పట్టును నిలుపుకొనేందుకు వైసిపి కూడ ప్రయత్నాలు చేస్తోంది.
కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్షపార్టీలు ఎత్తులు వేస్తున్నాయి.
కడప జిల్లాలో వైసిపికి కంచుకొట.అయితే వైసిపి నుండి ఎమ్మెల్యేలు, నాయకుల ఫిరాయింపుల కారణంగా ఆ పార్టీ ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. వైసిపితో ఢీ అంటే ఢీ అనే పరిస్థితిలో టిడిపి చేరింది.అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న టిడిపి,వైసిపి
కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను అదికార టిడిపి, విపక్ష వైసిపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఈ రెండు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.ఈ నెల 17వ, తేదిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.అయితే తమ వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులతో టిడిపి పుదుచ్చేరిలో క్యాంపు నిర్వహిస్తోంది.క్యాంపు నుండి సరాసరి ఓటింగ్ లో పాల్గొనేందుకు రానున్నారు టిడిపికి ఓటేసే ప్రజాప్రతినిధులు.

క్రాస్ ఓటింగ భయం కొంప ముంచేనా?
కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి నాయకులు తమకు మద్దతిచ్చే ప్రజాప్రతినిధులతో ఏకంగా బలప్రదర్శన చేశారు. తమ వర్గీయులతో కలిసి క్యాంపులో ఉంటున్నారు.అయితే మరోవైపు ఎన్నికల రోజున క్రాస్ ఓటింగ్ తమ కొంపముంచే అవకాశం లేకపోలేదనే భయం కూడ టిడిపి నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే వాస్తవానికి కడప జిల్లాలో టిడిపి బలం నామమాత్రమే.అయితే ఫిరాయింపుల ద్వారా ఆ పార్టీ బలం పెరిగింది. తమకు 458 మంది సభ్యుల బలం ఉందని ఆ పార్టీ ప్రకటించింది.అయితే కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకొంటామని ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు బాబు వద్ద ప్రస్తావించిన సమయంలో గెలిచి రావాలని ఆయన సూచించాడు.

ఫిరాయింపులతో బలం తగ్గిన వైసిపి
కడప జిల్లాలో ఐదువందలకు పైగా ప్రజా ప్రతినిధులు స్థానిక సంస్థల్లో ఉన్నారు.అయితే ఫిరాయింపుల ద్వారా ఆ పార్టీ బలం గణనీయంగా తగ్గిపోయింది. ఈ మేరకు టిడిపి నాయకులు వైసిపి నుండి స్థానిక సంస్థల్లో విజయం సాధించిన వారిని తమ పార్టీలోకి ఫిరాయించేలా చేశారని వైసిపి ఆరోపిస్తోంది.ఈ కారణాలతో వైసిపి బలం గణనీయంగా తగ్గిపోయిందని టిడిపి అభిప్రాయపడుతోంది.ఈ కారణంగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని టిడిపి నాయకులు ధీమాతో ఉన్నారు.

టిడిపి, వైసిపి ల వ్యూహలు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను అధికార, విపక్ష పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ మేరకు రెండు పార్టీలు తమ పట్టును కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాయి. వైసిపి తనకు మద్దతిచ్చే ప్రజా ప్రతినిధులతో బెంగుళూరు, గోవాలో క్యాంపులు నిర్వహిస్తోంది.టిడిపి నాయకులు పుదుచ్చేురిలో క్యాంపులు నిర్వహిస్తున్నారు.రాజ్యసభ సభ్యుడు టిడిపి నేత సిఎం రమేష్ టిడిపి అభ్యర్థి బిటెక్ రవి విజయాన్ని తన భుజాలపై వేసుకొన్నారు. మరో వైపు వైసిపి అధినేత చిన్నాన్న వివేకానందరెడ్డి గెలుపు కోసం వైసిపి నాయకులు కూడ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications