శ్రీగౌతమి హత్య: సొంత నేతలపై టీడీపీ వేటు, ఆ అధికారులపై వేటు కోసం సోదరి
నరసాపురం: శ్రీగౌతమిది హత్యేనని సీఐడీ తేల్చి చెప్పడంతో తెలుగుదేశం పార్టీ, టీడీపీ ప్రభుత్వంలో నిందితులు, అందుకు సహకరించిన వారిపై చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసుకు సంబంధించి నిందితులపై టీడీపీ చర్యలు తీసుకోగా, అధికారులపై వేటు పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
చదవండి: అక్క కేసులో చెల్లెలు పట్టు: అప్పుడే శ్రీగౌతమితో పరిచయం, రహస్యంగా పెళ్లి.. భార్యకు తెలిసి..
నిందితుల్లో నర్సాపురం జెడ్పీటీసీ ఉన్నారు. ఆయనతో సహా పార్టీకి సంబంధం ఉన్న వారిని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. అలాగే, హత్యను ప్రమాదకోణంలో చిత్రీకరించిన వారిపై కూడా చర్యలకు తీసుకోనుంది.

ఈ ప్రమాదం విషయంలో బాధితుల గోడు వినకుండా కేసు మూసేసిన అధికారుల పైన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోనుంది. ఏఎస్పీ రత్న పైన చర్యలు తీసుకోవాలని శ్రీగౌతమి సోదరి పావని డిమాండ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications