వైసీపీకి షాకిచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్ ... స్వగ్రామంలో టీడీపీ ఖాతాలో ఏకగ్రీవం, మాధవ్ మద్దతు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మొన్నటికి మొన్న పంచాయతీ తొలి విడత ఎన్నికల పోలింగ్ లో పలు ఆసక్తికర ఏకగ్రీవాలు, ఎన్నికలు చోటుచేసుకోగా తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హిందూపూర్ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు ఆయన స్వగ్రామంలోనే ఇబ్బందికర పరిణామం ఎదురయింది. తనకు ఎదురు లేదు అని మీసం మెలిపెట్టే గోరంట్ల మాధవ్ టీడీపీ బలపరిచిన అభ్యర్థిని ఒప్పుకోవాల్సి వచ్చింది .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కర్నూలు జిల్లా రుద్రవరం గ్రామంలో పంచాయతీ సర్పంచ్ పదవిని టిడిపి మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. టిడిపి మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఎంకే మధు ను ఆ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టిడిపి బలపరిచిన ఎంకే మధు గోరంట్ల మాధవ్ కు దగ్గరి బంధువు కూడా అవుతారు. దీంతో మాధవ్ సైతం మధు కు మద్దతు ఇచ్చినట్లుగా సమాచారం.

అయితే టిడిపి బలపరిచిన అభ్యర్థికి గోరంట్ల మాధవ్ మద్దతు ఇవ్వడంపై వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. వైసిపి బలపరిచిన అభ్యర్థిని కాకుండా టిడిపి బలపరిచిన అభ్యర్థి, సమీప బంధువు అంటూ మద్దతు ఇవ్వడం పై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా తన బంధువు సర్పంచ్ అయ్యారన్న విషయం పక్కన పెడితే, టిడిపి బలపరిచిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అన్నది ఒకరకంగా గోరంట్ల మాధవ్ కు ఇబ్బందికర పరిణామమనే చెప్పాలి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications