విద్యార్థులకు చెప్పుదెబ్బలు... ఓ టీచరమ్మ నిర్వాకం
తూర్పుగోదావరి జిల్లా : విధ్యార్థులకు విద్యా బుద్దులు నేర్పి సక్రమ మార్గంలో నడపాల్సిన ఉపాధ్యాయులే తప్పుడు మార్గంలో నడుస్తున్నారు. పాఠశాలకు సక్రమంగా రాకపోవడమే కాకుండా విధ్యార్థులను చెప్పులతో కొట్టే ఓ టీచర్ నిర్వాకం తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది.ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపారు.
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలంలోని జి .రాగంపేట ప్రభుత్వ పాఠశాలలో విధ్యార్థులను టీచర్ సరోజ చెప్పుతో కొట్టిన ఘటన వెలుగు చూసింది. పలు మార్లు ఇదే రకంగా వ్యవహారిస్తోన్న టీచర్ వ్యవహారశైలిపై స్థానికులు విద్యశాఖాధికారులకు ఫిర్యాదు చేయడంతో విసయం వెలుగు చూసింది

టీచర్ నిర్వాకాన్ని పలుమార్లు స్థానిక ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకపోవడంతో స్థానికులు ఎంఇఓ కు ఫిర్యాదు చేశారు.పాఠశాలకు ఆమె తరచూ డుమ్మా కొట్టేవారని స్థానికులు చెబుతున్నారు. విద్యా కమిటీ చైర్మెన్ ఎంఇఓకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేశారు.
విద్యార్థులను టీచర్ చెప్పుతో కొట్టిన ఘటనపై ఎంఇఓ విచారణ జరిపారు. విధ్యార్థులను చెప్పుతో కొట్టిన విషయం వాస్తవమేనని ఆమె ఒప్పుకొన్నారు.లిఖితపూర్వక సంజాయిషీని కోరినట్టు ఎంఇఓ బాబురావు చెప్పారు.ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారాయన.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications