ఆఫీస్ బిల్డింగ్ పైనుండి దూకి టెక్కీ ఆత్మహత్యాయత్నం

వాహనంపై పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆయనను తోటి ఉద్యోగులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.
ఉద్యోగాల పేరుతో టోకరా
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుండి డబ్బు తీసుకోవడమే కాకుండా సెల్ టవర్ల ఏర్పాటుకు స్థలం కావాలంటూ యజమానుల నుంచి ముందస్తు డిడిలు వసూలు చేసి బిచాణా ఎత్తివేసిన సంఘటన హైదరాబాదులో జరిగింది. వసూలు చేసిన మొత్తం రూ.3 కోట్ల మేర ఉంటుందని బాధితులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ పరిధిలో సిల్వర్ స్టోన్ ఇన్ఫోటెక్ పేరుతో ఓ సంస్థను నెలకొల్పారు. సెల్ ఫోన్ కంపెనీతో సెల్ టవర్లు ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు నమ్మబలికారు. టవర్స్ ఏర్పాటుకు స్థలం అవసరమని, నెల నెల అద్దె చెల్లిస్తామని సుమారు వందమంది యజమానుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. తమ సంస్థ తరఫున ఉద్యోగులు కూడా ఇప్పిస్తామని నిరుద్యోగుల నుండి డబ్బులు తీసుకున్నారు. ఆ తరవాత బిచాణా ఎత్తేశారు.












Click it and Unblock the Notifications