ఎంత చెప్పినా..: ప్రేమ పేరుతో మోసం చేసిన టెక్కీ, యువతి ఫిర్యాదు
హైదరాబాద్: ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్బీ) పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు. ఎస్సై జానయ్య తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన లావణ్య తన బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి వచ్చింది.
అక్కడకు వచ్చిన దూరపు బంధువు అయిన సాఫ్టువేర్ ఉద్యోగి అల్లు ఉపేంద్ర (25)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఏడాది నుండి వీరు సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని ఆమెకు అతను పలుమార్లు చెప్పాడు.

తొలుత పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఉపేందర్ ఆ తర్వాత ముఖం చాటేశాడు. లావణ్య తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా పెళ్లి విషయమై అతనితో మాట్లాడారు. అయినప్పటికీ ఉపేంద్ర తగ్గలేదు. దీంతో అతను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో అతను పెళ్లికి అంగీరించాడు. అనంతరం మళ్లీ పేచీ పెట్టాడు. తాను పెళ్లి చేసుకోనని చెప్పాడు. దీంతో లావణ్య తల్లిదండ్రులు మంగళవారం నాడు మరోసారి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు అతని పైన కేసు నమోదు చేశారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications