హత్య, టెక్కీ సూసైడ్: కుటుంబ కలహాలా, గదిలోనే కుక్క
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాఫ్టువేర్ ఇంజనీర్ మనీష్ తన భార్య శ్వేతను, తనయుడు యష్ను హత్య చేసి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, మనీష్ పెంపుడు కుక్క మూడు రోజులుగా అదే గదిలో ఉంది.
లోపలి నుండి గడియ పెట్టి ఉండటంతో కుక్క బయటకు రాలేకపోయింది. టెక్కీ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న పోలీసులు బాల్కనీ కిటికిలో నుండి లోపలకు వెళ్లేసరికి మృతదేహాలు ఉన్న గదిలోనే కుక్క తచ్చాడుతూ కనిపించింది.

కంపెనీ ప్రతినిధులు వచ్చే వరకు విషయం వెలుగు చూడలేదు. పక్కన ప్లాటులో ఉన్న వారు లేదా అపార్టుమెంటు సెక్యూరిటీ గుర్తించలేకపోయారు.
కుటుంబ కలహాలా?
భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మనీష్ తన భార్య శ్వేతతో గొడవపడి ఇంట్లో కూరగాయలు కోసే కత్తితో ఆమె చేతి మణికట్టు నరాలను కోసేసినట్లు భావిస్తున్నారు. అడ్డువచ్చిన కొడుకును సైతం హతమార్చినట్లు పోలీసులు చెబుతున్నారు. మనీష్కు నెలకు రూ.లక్షకు పైనే వేతనం. దీంతో ఆర్థిక ఇబ్బందులు లేవంటున్నారు. అయితే తరుచూ భార్యాభర్తలు గొడవపడేవారట. రెండు నెలల క్రితం శ్వేత తన భర్త వేధిస్తున్నాడంటూ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిందట.












Click it and Unblock the Notifications