మరో మారు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ .. జలవివాదాల పరిష్కారం కోసమే..

Recommended Video

    జలవివాదాల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ || KCR And Jagan Likely To Meet || Oneindia

    తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలు నెలకొనాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు . ఇప్పటికే ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే ధోరణి కొనసాగిస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లు మరొకసారి కలవనున్నారు.

    ఇరు రాష్ట్రాల జల వివాదాలు పరిష్కరించేందుకు భేటీ కానున్న సీఎం కేసీఆర్ , సీఎం జగన్

    ఇరు రాష్ట్రాల జల వివాదాలు పరిష్కరించేందుకు భేటీ కానున్న సీఎం కేసీఆర్ , సీఎం జగన్

    రెండు రాష్ట్రాలకు గోదావరి నీటిని బాగా ఉపయోగించుకునే వ్యూహంపై చర్చించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె చంద్రశేఖర్ రావు, వైయస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 28, 29 తేదీల్లో ప్రగతి భవన్ లో సమావేశమయ్యే అవకాశం ఉంది.ఈ సమావేశానికి ఎపి ప్రత్యేక చీఫ్ సెక్రటరీ (ఇరిగేషన్) మరియు ఇతర అధికారులతో సహా నీటిపారుదల అధికారుల బృందం సమావేశానికి హాజరవుతుందని వర్గాలు తెలిపాయి.ఇటీవల, ముఖ్యమంత్రులు ఇద్దరూ అమరావతిలో సమావేశమై, అందుబాటులో ఉన్న గోదావరి జలాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రాథమిక చర్చలు జరిపారు.ప్రాథమిక సమావేశంలో, ముఖ్యమంత్రులు ఇద్దరూ 1,480 టిఎంసి అడుగుల గోదావరి నీటిని, 811 టిఎంసి అడుగుల కృష్ణ నీటిని ఉమ్మడి ఏపికి కేటాయించాలన్న ఒప్పందానికి వచ్చారు. "అందుబాటులో ఉన్న నీటిని ఉపయోగించడం ద్వారా మేము రెండు రాష్ట్రాలలో ప్రతి అంగుళం భూమికి సాగునీరు ఇస్తాము" అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇటీవల ప్రకటించారు .

    28, 29 తేదీల్లో ముఖ్యమంత్రుల సమావేశం .. స్నేహపూర్వకంగా సమస్యల పరిష్కారమే సాధనం

    28, 29 తేదీల్లో ముఖ్యమంత్రుల సమావేశం .. స్నేహపూర్వకంగా సమస్యల పరిష్కారమే సాధనం

    దీని ప్రకారం జూన్ 28, 29 తేదీల్లో ముఖ్యమంత్రులు ఇద్దరూ మరో రౌండ్ సమావేశం జరిగే అవకాశం ఉంది. తరువాత, తెలంగాణ అధికారులు మరో రౌండ్ చర్చల కోసం విజయవాడకు వెళతారు.
    నది జలాలను పంచుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తోంది. రాష్ట్రాలు సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరిస్తే రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి కోర్టుల జోక్యం అవసరం ఉండదని రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈనెల 28న హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవ్వనున్నారు. ఈసమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని కీలకమైన విషయాలపై చర్చలు జరిపి అంతే కీలకమైన నిర్ణయాలను తీసుకోనున్నారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ జల వివాదాల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కీలక భేటీ నిర్వహించనున్నారు.

    26 నుండి 29 వరకు హైదరాబాద్ లోనే ఉండనున్న జగన్

    26 నుండి 29 వరకు హైదరాబాద్ లోనే ఉండనున్న జగన్


    అంతేకాకుండా ముఖ్యమైన గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలింపు, లింక్ కెనాల్ వంటి అంశాలపై చర్చిస్తారని తెలుస్తుంది . అంతే కాదు జూన్ 29న కూడా జగన్, కేసీఆర్ లు మరోసారి భేటీ అవుతారని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ విషయాన్నీ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది . దీనికి సంబంధిత చర్చలు కూడా అధికారులు ఏర్పాటు చేశారని సమాచారం. కాగా ఈనెల 26 న జగన్ హైదరాబాద్ కి రానున్నారు. తన పనుల నిమిత్తం ఈనెల 29 వరకు కూడా జగన్ హైదరాబాద్ లోనే ఉండనున్నారు. ఈ మధ్యలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి సమావేశం నిర్వహించనున్నారు. చాలా కాలంగా ఉన్న జల వివాదాలు ఈ భేటీ లో పరిష్కారం అవుతాయని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ధీమాతో ఉన్నారు. ఇక వీరి భేటీపై ఇరు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+