కేసీఆర్ సంచలనం: రాజయ్య బర్తరఫ్, మంత్రిగా కడియం శ్రీహరి ప్రమాణం
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య పైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజయ్యను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేశారు. ఆయన స్థానంలో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి రాజ్ భవన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాజయ్యను భర్తరప్ చేసే కేసీఆర్ నిర్ణయాన్ని గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం గవర్నర్తో భేటీ అయ్యారు. అనంతరం కడియంతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీ రామారావు, ఈటెల రాజేందర్, జోగు రామన్న, ఎంపీ కే కేశవ రావు తదితరులు హాజరయ్యారు. ఇటీవల సంభవించిన పరిణామాల నేపథ్యంలో రాజయ్యను తొలగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో కడియంను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
మంత్రివర్గంలోను మార్పులు చేర్పులు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి పదవిని కడియం నిర్వహిస్తారు. అలాగే విద్యాశాఖను అప్పగించారు. ఇన్నాళ్లుగా విద్యాశాఖ నిర్వహించిన జగదీశ్వర్ రెడ్డికి విద్యుత్ శాఖను అప్పగించారు. రాజయ్య వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖను లక్ష్మారెడ్డికి ఇచ్చారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications