లోకసభ ఎన్నికలు: తెలంగాణ కీలకం, లబ్ధి ఎవరికి?

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెసు అధిష్టానం తన పార్లమెంటు సభ్యుల నుంచి, శాసనసభ్యుల నుంచి తిరుగుబాటును ఎదుర్కుంటోంది. ఈ స్థితిలో సీమాంధ్రలో కాంగ్రెసు తుడిచిపెట్టుకు పోతుందనే అంచనాలు సాగుతున్నాయి. కాంగ్రెసు అధిష్టానంపై తిరుగుబాటు ప్రకటించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఎటు వైపు వెళ్తారనే విషయంపై కూడా కాంగ్రెసు భవిష్యత్తు ఆధారపడి ఉండవచ్చు.
సీమాంధ్రలో తాము తుడిచిపెట్టుకుపోతామని భావించిన కాంగ్రెసు అధిష్టానం తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి అత్యధిక స్థానాలు సాధించే ఆలోచనలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే అది సాధ్యమవుతుందనే ఆంచనాలో కాంగ్రెసు అధిష్టానం ఉంది.
దక్షిణ భారతదేశంలో అత్యధిక పార్లమెంటు సీట్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో 42 లోకసభ స్థానాలున్నాయి. వీటిలో 25 సీమాంధ్రలో ఉండగా, 17 తెలంగాణలో ఉన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెసు శాసనసభ్యులు, లగడపాటి రాజగోపాల్ వంటి పార్లమెంటు సభ్యుల వ్యవహారశైలి, తిరుగుబాటు సీమాంధ్రలో గాలి ఎటు వైపు వీస్తున్నదని చెప్పడానికి సంకేతాలుగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications