అందుకే కెసిఆర్ బతికుండగా రాదు: టిపై టిజి వెంకటేష్

రాయల తెలంగాణ ప్రతిపాదనల నేపథ్యంలో తెరాస ఇచ్చిన తెలంగాణ బంద్ విఫలమైందన్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెరాసలు త్వరలో కాంగ్రెసు పార్టీలో విలీనం అవుతాయని టిజి వెంకటేష్ జోస్యం చెప్పారు.
రాష్ట్ర విభజనకు ఆంధ్ర, రాయలసీమ నాయకులే శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి ముందు స్పందించని వాళ్లు ఆ తర్వాత స్పందించారని విమర్శించారు. భద్రాచలమే కాకుండా శ్రీశైలం, చిత్తూరు, విశాఖలను కూడా తీసుకోండని వ్యాఖ్యానించారు. పది లేదా పన్నెండు జిల్లాలతో కూడిన తెలంగాణ తమకు ఎప్పుడు సమ్మతం కాదన్నారు. తాను సమైక్యవాదానికే కట్టుబడి ఉంటానని చెప్పారు.
రాయల తెలంగాణ ఎవరు అడిగారని, రాయలసీమను విభజిస్తే అనేక సమస్యలు వస్తాయని తెలుగుదేశం పార్టీ ఎంపీలు శివ ప్రసాద్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఢిల్లీలో అన్నారు. శివప్రసాద్ మాట్లాడుతూ రాయల తెలంగాణ ప్రతిపాదన కాంగ్రెస్ నిర్ణయమని, ఎవరూ కోరలేదని అన్నారు.
తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడానికే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తెరపైకి తీసుకు వచ్చిందని ఆయన అన్నారు. మోదుగుల మాట్లాడుతూ తెలుగు ప్రజల సమస్యలపై పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని అన్నారు. ప్రధానమంత్రి చలనం లేకుండా వ్యవహరిస్తున్నారని, ఆయన ఓ మైనపు బొమ్మని, ఆయనను కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే అని ఆయన పేర్కొన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications