టి బంద్:జగన్పై గుడ్లతో దాడి, సోనియా గుడి కూల్చివేత
సమైక్యాంధ్రకు మద్దతుగా జాతీయ నాయకులను కలుస్తున్న జగన్ చెన్నైలో జయలలిత, కరుణానిధిలను కలిసి బుధవారం హైదరాబాదుకు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి జగన్ కాన్వాయ్ వస్తుండగా విద్యార్థులు, తెలంగాణవాదులు జగన్ను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. గుడ్లతో, టమాటాలతో దాడి చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టి, దాదాపు యాభై మందిని అదుపులోకి తీసుకున్నారు.
సోనియా తాత్కాలిక గుడి కూల్చివేత
కరీంనగర్ జిల్లాలోని తెలంగాణ చౌక్లో గల ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తాత్కాలిక గుడిని తెలంగాణవాదులు కూల్చివేశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఓయులో ఉద్రిక్తత
తెలంగాణ బంద్ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి ఏర్పడ్డాయి. విద్యార్థులు రాయల తెలంగాణను నిరసిస్తూ బైక్ ర్యాలీతో వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్జీరంగా రంగా వర్సిటీలో విద్యార్థులు ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. మరోవైపు సచివాలయం వద్ద భారీగా బిఎస్ఎఫ్ దళాలను మోహరించారు. ఉద్యోగులను మినహా లోనికి ఎవరినీ అనుమతించడం లేదు.