చంద్రబాబు-రేవంత్ భేటీ అజెండా ఖరారు..! ఇద్దరూ ఒప్పుకుంటే మోడీ సై..!
తెలుగు రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లు దాటిపోతున్నా ఇంకా ఉమ్మడి సంస్థల విభజన సహా పలు పెండింగ్ సమస్యలు వెంటాడుతున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్ లో భేటీ కానున్నారు. నగరంలోని ప్రజా భవన్ లో సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఇందులో ఇద్దరు ముఖ్యమంత్రులు పలు కీలక అంశాలపై చర్చించి ఓ పరిష్కారం కనుగొంటారని తెలుస్తోంది.

చంద్రబాబు-రేవంత్ రెడ్డి భేటీలో ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపై చర్చించబోతున్నారు. విభజన జరిగి పదేళ్లయినా ఈ సంస్థలు మాత్రం ఇంకా విభజించలేదు. వాస్తవానికి కేంద్రం ఈ సంస్థల విభజనపై పదేళ్ల క్రితం షీలా బేడీ కమిటీ వేసింది. షెడ్యూల్ 9లో 91 సంస్థలుంటే వీటిలో 68 సంస్థల ఆస్తులు, అప్పుల విభజనపై ఎలాంటి ఇబ్బందీ లేదు. మరో 23 సంస్థలపై పేచీ నెలకొంది. అలాగే షెడ్యూల్ 10లో 142 సంస్థలుంటే వీటిలో దాదాపు 30 సంస్థల విభజనపై వివాదాలున్నాయి.
అలాగే రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల పరస్పర చెల్లింపుల అంశంపైనా చంద్రబాబు-రేవంత్ రెడ్డి మధ్య చర్చ జరగనుంది. తెలంగాణ తమకు ఏపీ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే, ఏపీ కూడా తమకు రూ.7 వేల కోట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో కోరుతోంది. వీటిపై చర్చించి ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. అలాగే హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వం వాడుకుంటున్న భవనాలను ఈ మధ్యే రేవంత్ సర్కార్ పదేళ్లు దాటిందన్న కారణంతో స్వాధీనం చేసుకుంది. వీటిపైనా చంద్రబాబు చర్చించే అవకాశముంది. ఇక పోలవరం వల్ల మునిగే గ్రామాల అంశంతో పాటు మరికొన్నింటిపైనా చర్చ జరగనుంది.
-
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
వారికి గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ -
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
మూసీపై కేబినెట్ సబ్ కమిటీ- సభ్యులు వీళ్లే -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య..











Click it and Unblock the Notifications