హైదరాబాద్లో 40 డిగ్రీల ఎండ- బరాబర్ సెగ
Temperature in Hyderabad: తెలంగాణలో ఎండ తీవ్రత రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. ఉక్కపోతకు గురి చేస్తోంది. ఈ నెల మొదటి వారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలు పగటి ఉష్ణోగ్రత చుక్కలు చూపిస్తోంది. నడివేసవి నాటి వాతావరణాన్ని తలపిస్తోంది. ఫిబ్రవరి తొలి అర్ధభాగంలోనే రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 35 నుంచి 37 డిగ్రీలుగా నమోదవుతోండటమే దీనికి నిదర్శనం.
వచ్చే నాలుగు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ అభివృద్ది ప్రణాళిక మండలి, భారత వాతావరణ కేంద్రం అంచనా వేశాయి. ఫిబ్రవరిలోనే పగటి ఉష్ణోగ్రత గరిష్ఠంగా 40 డిగ్రీలకు చేరే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డాయి.

హైదరాబాద్లో ఎండ తీవ్రత మరింత అధికంగా ఉంటుందని టీజీడీపీఎస్ పేర్కొంది. సాధారణంగా ఫిబ్రవరిలో హైదరాబాద్లో 33 నుంచి 36 డిగ్రీల వరకు ఎండ కాస్తుంటుంది. ఈ సీజన్లో మాత్రం నాలుగు డిగ్రీలు అధికంగా దీని తీవ్రత ఉండబోతోందని టీజీడీపీఎస్ వైవీ రామారావు అంచనావేశారు. ఈ నెలా చివరి నాటికి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరవచ్చని చెప్పారు. తొలిసారిగా ఫిబ్రవరిలో 40 డిగ్రీల రికార్డు కావడానికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
అటు ఏపీలోనూ ఇదే తీవ్రత కనిపిస్తోంది. ఈ నెల 14వ తేదీన కోస్తా, రాయలసీమ జిల్లాల్లో దాదాపుగా 10కి పైగా వేర్వేరు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదు కావడం.. వచ్చే వేసవి తీవ్రత ఎలా ఉండబోతోందనే విషయాన్ని రుచి చూపించినట్టయింద. శుక్రవారం నాడు కర్నూలులో అత్యధిక ఉష్ణోగ్రత 37.4 డిగ్రల ఎండ కాసింది.
కోస్తా జిల్లాల్లో గాలిలో తేమశాతం 45 నుంచి 70 శాతం వరకు ఉండగా.. ఈ సంఖ్య రాయలసీమలో 25 నుంచి 45 శాతంగా రికార్డయింది. పొడి వాతావరణం కారణంగా ఎండ తీవ్రత అధికంగా ఉంటోందని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. బంగాళాఖాతం మీదుగా వీస్తోన్న వేడి గాలుల వల్ల పొడి వాతావరణం నెలకొంటోంది.
-
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications