ఎర్రచందనం స్మగ్లర్ల ఎత్తుగడలు:తిరుమలలో భక్తుల మధ్యే మకాం...అరెస్టు సందర్భంగా హైడ్రామా
తిరుపతి:తిరుమలలో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్ సందర్భంగా హై డ్రామా చోటుచేసుకుంది. ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునేందుకు తమిళనాడు నుంచి వచ్చిన పోలీసులు ఎట్టకేలకు వారి స్థావరం గుర్తించారు.
తిరుమలలో భక్తుల మధ్యే మకాం వేసి ఉన్న వారిని మంగళవారం అర్థరాత్రి తమిళనాడు పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టి అదుపులోకి తీపుకున్నారు. అర్థరాత్రి సమయంలో పోలీసులు పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా చుట్టుముట్టి తమ మధ్యలో ఉన్న కొంతమందిని అరెస్ట్ చేస్తుండటం, కొంతమంది ఈడ్చి పోలీసు వాహనాల్లో వేస్తుండటంతో ఏం జరుగుతుందో అర్థం కాక భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఆ తరువాత అక్కడ ఉన్న కొందరు తమిళనాడు భక్తులు పోలీసులను విషయం ఏమిటో అడిగి కనుక్కొని చెప్పడంతో అప్పుడు అసలు సంగతి అర్థమై ఔరా!.. అనుకున్నారు. తమిళనాడు,చోడవరంకు చెందిన ఎర్ర చందనం కూలీలు అక్కడ నుంచి వచ్చి శేషాచలం అడవులలో ఎర్రచందనం చెట్లను నరికి స్మగ్లర్లకు అప్పగించేవారు. అయితే ఇటీవల ఎర్రచందనం స్మగర్లు,కూలీలపై నిఘా ముమ్మరం కావడంతో వారు తెలివిగా ఆలోచించి తిరుమలలో భక్తుల మధ్యే ఆవాసం ఏర్పరుచుకున్నారు.
అయితే ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందడంతో పాటు ఆ ఎర్రచందనం స్మగ్లర్లలో కొందరు పాత నేరస్థులు కూడా ఉన్నారన్న విషయం తెలిసింది.దీంతో అర్ధరాత్రి నేరుగా తిరుమల చేరుకున్న తమిళ పోలీసులు భక్తుల్లో కలసి ఎక్కడో మకాం వేసిన ఎర్రచందనం స్మగ్లర్ల కోసం తీవ్ర అన్వేషణ సాగించారు. చివరకు వారిని గుర్తించడం ద్వారా తమ ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. ఆ విధంగా భక్తుల మధ్యే మకాం వేసిన 11 మంది ఎర్ర చందనం కూలీలను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.
-
శ్రీవారి దర్శనం టికెట్ల బుకింగ్స్లో కీలక మార్పులు, ఇక సులభంగా..!! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!











Click it and Unblock the Notifications