దొంగలను ఛేజ్ చేసి సినీ ఫక్కీలో పట్టుకున్న పోలీసులు
గుంటూరు: రోడ్డు పక్కనే లారీ నిద్రిస్తున్న డ్రైవరును దోచుకుని బైక్పై ఉడాయిస్తున్న ఇద్దరు యువకులను సినీ ఫక్కీలో పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం - కృష్ణాజిల్లా నూజివీడుకు చెందిన లారీ డ్రైవర్ షేక్ యాకూబ్ మంగళవారం రాత్రి సుబాబుల్ను లోడ్ చేసుకునేందుకు చిలకలూరిపేట వచ్చాడు.
బుధవారం ఉదయం లోడింగ్ జరుగుతుందని తెలిసి, అర్ధరాత్రి కావటంతో జాతీయ రహదారి ప్రక్కనే పెట్రోలు బంకు సమీపంలో లారీని నిలిపి నిద్రపోయాడు.తెల్లవారుజామున నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన హనుమయ్య, అచ్చయ్య అనే యువకులు ఇనుప రాడ్డుతో యాకూబ్పై దాడిచేశారు.

కత్తితోగాయపరిచి యాకూబ్ దగ్గర ఉన్న రూ.27,400ల నగదు లాక్కుని బైక్పై ఉడాయించారు. పారి పోతున్న దుండగులను గమనించిన నైట్బీట్ కానిస్టేబుల్ హనుమంతరావు, హోంగార్డు వలి ఛేజ్ చేసి తాతపూడి వద్ద పట్టుకున్నారు. ఇద్దరిని స్టేషన్కు తరలించారు.












Click it and Unblock the Notifications