అధికారంతో వైసీపీ వేధింపులకు గురి చేస్తోంది : కన్నా లక్ష్మినారయణ
భవిష్యత్ లో ఏ పార్టీతో పోత్తుపెట్టుకోమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మినారయణ స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు సార్లు పోత్తులు పెట్టుకుని నష్టపోయామని ఆయన తెలిపారు. వినుకొండ నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడారు. ముస్లింలు దళితులే పార్టీలో ఎక్కువగా చేరుతున్నారని ఆయన చెప్పారు. సిద్దాంతాలను ఆకర్షితులైన ప్రజలు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. 2024 కల్లా స్వంతగా బీజేపీ జెండా ఎగరవేయాలన్నదే తమ లక్ష్యమని అని అన్నారు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వంపై ఆయన ఫైర్ అయ్యారు. గతంలో టీడీపీ కూడ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాకాలు సృష్టించిందని ఇప్పుడు వైసీపీ కూడ ఇదే ధోరణి అవలంభిస్తుందని విమర్శించారు.రాష్ట్రంలో రాజన్న పాలన తెస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ పోలీసుల రాజ్యం తీసుకువస్తున్నారని విమర్శించారు.

ఎంతమంది నాయకులు మారినా మైనింగ్ లో దోపిడి మాత్రం ఆగడం లేదని అన్నారు. ఎవరైన అవినీతీకి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శత్రువులను కూడ దగ్గరికి తీసేవారని ఈ సంధర్భంగా గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications