ఈసారి మోడీ వేవ్ లేదు.. తేల్చేసిన బీజేపీ మహిళా ఎంపీ అభ్యర్ధి నవనీత్ కౌర్..!
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొంది. రాజకీయ పార్టీలు ప్రత్యర్ధులపై పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ నరేంద్ర మోడీ కచ్చితంగా ప్రధాని కావాలని భారతీయులు ముఖ్యంగా ఉత్తర భారతీయులు కోరుకోవడంతో ఆయనకు ఎదురేలేకుండా పోయింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం అందుకునేందుకు రెండేళ్లుగా మోడీ పలు వ్యూహాలు రచించారు. అయినా ఇవేవీ పనిచేయడం లేదా ? అంటే చాలా చోట్ల అవుననే సమాధానమే వస్తోంది.
ఈసారి ఎన్నికల్లో మోడీ వేవ్ లేదని స్వయంగా బీజేపీ నుంచి మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్ధి నవనీత్ కౌర్ రాణా తేల్చిచెప్పేశారు. ఈ మేరకు ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అమరావతి సీటు నుంచే స్వతంత్ర ఎంపీగా గెలిచిన నవనీత్ రాణా ఈ మధ్యే బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. కానీ పోటీకి వచ్చే సరికి ఆామెకు సీన్ అర్ధమవుతోంది.

తాము ఈ ఎన్నికలను గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే పోరాడాలని నవనీత్ కౌర్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఓటర్లందరినీ బూత్కు తీసుకొచ్చి ఓటు వేయమని చెప్పాల్సి వస్తుందన్నారు. మోదీ వేవ్ ఉందన్న భ్రమల్లో ఉండకండని పార్టీ నేతలకు, కార్యకర్తలకు నవనీత్ కౌర్ సూచించారు. గతంలో తాను మోడీ పవనాలు వీచినా తాను స్వతంత్ర ఎంపీగా గెలిచిన విషయాన్ని గుర్తుచేస్తూ ఈసారి ఎంత కష్టపడాలో ఆమె తెలిపారు.
బీజేపీ ఎంపీ నవ్ నీత్ కౌర్ వ్యాఖ్యలపై ఎన్సీపీ స్పందించింది. రాణా ఏం మాట్లాడినా అది వాస్తవమని, అది ఆమెకూ తెలుసని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేష్ తపసే తెలిపారు. మోడీ వేవ్ లేదని బీజేపీకే తెలుసన్నారు. విపక్షాలను చీల్చి నేతలను పార్టీలో చేర్చుకున్నప్పుడే బీజేపీకి ఇది అర్దమైందన్నారు.
-
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications