సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. రాజ్యాంగంలో ‘రాజధాని’ పదమే లేదు.. సీఎం ఉన్నచోటే పాలనా కేంద్రం..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో టీడీపీ అడ్డుకోవడాన్ని ముఖ్యమంత్రి వైస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. మండలి రద్దుపై గురువారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన రాజధానుల అంశంపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని గురంచి రాజ్యాంగం ఏం చెబుతున్నదో, దాని ప్రకారం గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉండాలో ఆయన వివరించారు. సీఎం సంచలన ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఆ పదమే లేదు..
‘‘శాసన మండలి అనేది రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. కేవలం 6 రాష్ట్రాల్లోనే అది ఉందంటే అర్థమేంటి? కన్వీనియన్స్ కోసం.. మేధావుల సలహాల కోసం ప్రభుత్వమే ఏర్పాటు చేసిన వ్యవస్థ అది. సలహాలు, సూచనలు ఇవ్వకపోగా అదే వ్యవస్థ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పరిస్థితికొస్తే దాని అవసరం ఉందా? లేదా? అని సీరియస్ గా ఆలోచించాలి. ఈ పరిస్థితికి దారితీసిన ఆ రెండు బిల్లులూ ప్రజలకు మేలు చేసేవే. రాజధాని గురించి ఏవేవో మాట్లాడుతున్నవాళ్లు ఒక విషయం తెలుసుకోవాలి. అసలు రాజ్యాంగంలో ‘క్యాపిటల్‘ అన్న పదమే లేదు.

సీట్ ఆఫ్ గవర్నెన్స్
రాజధాని అనే మాటను ఎక్కడా వాడకుండా.. ‘‘సీట్ ఆఫ్ గవర్నెన్స్(పరిపాలించే వ్యక్తి ఉండే చోటు)'' అని మాత్రమే రాజ్యాంగంలో ప్రస్తావించారు. ప్రజలకు ఉత్తమమైన సేవలు అందేలా పరిపాలనను వికేంద్రీకరించుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ప్రజలే ఇచ్చిన అధికారం. రాష్ట్రంలో ఎక్కడ కూర్చొనయినా పరిపాలన చేయొచ్చు. పాలనకు ముఖ్యమంత్రే అధిపతిగా ఉంటాడు. కేబినెట్ తోపాటు, సెక్రటరీలూ ఆయనకు సహకరిస్తూ ఉంటారు. దాన్నే సింపుల్ గా సెక్రటేరియట్ అని పిలుస్తారు. దీని ఏర్పాటుకు ఏ చట్టమో, బిల్లో అవసరం లేదు. ఒకే ఒక్క తీర్మానంతో సీఎం ఎక్కడ కూర్చొనయినా పరిపాలన చేయొచ్చు. రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేనేలేదు. ఆర్టికల్ 174 ప్రకారం అసెంబ్లీని ఎక్కడైనా పెట్టుకోవచ్చు.

చట్టాల్లో స్పష్టంగా ఉంది..
జయలలితగారు బతికున్నప్పుడు ఆమె ఊటి నుంచే పరిపాలన సాగించేవారు. మనకు హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు కూడా పది రోజులు వైజాగ్ లోనే ఉన్నాడు. అంటే పరిపాలన(గవర్నెన్స్) ఎక్కడి నుంచి జరిగింది? రేప్పొద్దున ఇంకెక్కడైనా ప్రకృతి విపత్తు వస్తే ముఖ్యమంత్రులు షిఫ్ట్ కారా? సీఎం ఎక్కడుంటే పరిపాలన అక్కడి నుంచే జరుగుతుంది. ‘‘సీట్ ఆఫ్ గవర్నెన్స్'' ను వికేంద్రీకరించుకునే స్వేచ్ఛ ఆ ప్రభుత్వానికి ప్రజలిచ్చే అధికారం. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు చట్టాలు చేస్తూ వ్యవస్థను నడపడమే పరిపాలన. ఇంత స్పష్టంగా చట్టాల్లో ఉన్నప్పటికీ కొందరు ఎందుకీరకంగా యాగీ చేస్తున్నారో వాళ్లే ప్రశ్నించుకోవాలి''అని సీఎం జగన్ అన్నారు. మండలిని రద్దు చేయాలా? వద్దా? అనేదానిపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చిద్దామని ఆయన అనడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
-
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో కొత్త లోక్సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications