అవి సాధారణ ఐటీ దాడులు కాదు...సెలెక్టెడ్ దాడుల్లాగా ఉన్నాయి:కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
విజయవాడ:ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు సాధారణ ఐటి దాడుల్లాగా లేవని...సెలెక్టెడ్ దాడులుగా కనిపిస్తున్నాయని ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు.
విజయవాడ ఆంధ్రరత్నభవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐటీ దాడులు పార్టీలకు అతీతంగా బిజెపి,టిడిపి,వైసిపిలో ఉన్నవారిపై జరిగితే ఆహ్వానిస్తామని...అయితే కొంతమందిని మాత్రమే టార్గెట్ చేసి చేస్తున్న ఈ దాడులు ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపేనని తులసిరెడ్డి ఆరోపించారు. ప్రధాని మోడీ రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను స్వప్రయోజనాల కోసం వాడుతూ వాటిని నిర్వీర్యం చేస్తున్నారని తులసి రెడ్డి విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్లో పథకం ప్రకారమే ఐటీ దాడులు జరుగుతున్నాయని...అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. బిజెపి నేతలు పథకం ప్రకారం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఐటీ దాడులు చేపట్టారని ఆయన మండిపడ్డారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందని...అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తులసి రెడ్డి ఎద్దేవా చేశారు.
తిట్టాలంటే ఎవరైనా తిట్టగలరని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్కు నోటి దురుసు ఎక్కువని అందరికీ తెలుసని, సీఎం హోదాలో ఉండి వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. తెలంగాణలో మహాకూటమి విజయం ఖాయమని తులసిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications