వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు వద్దకు టి సపోర్టర్స్: వినోద్, కదిలించింది: కేశవ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vinod Kumar
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్షకు సంఘీభావం తెలిపిన వారంతా తెలంగాణకు మద్దతిచ్చిన వారేనని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు వినోద్ కుమార్ శుక్రవారం అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబులు చేయాల్సింది సమైక్యాంధ్ర ఉద్యమం కాదని, సీమాంధ్ర ఉద్యమమన్నారు. మీకు ఏం కావాలో డిమాండ్ చేయాలని సూచించారు.

పరిస్థితి చేయి దాటక ముందే మేలుకోవాలని సీమాంధ్రులకు సూచించారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఆపేసి సీమాంధ్రకు ఏం కావాలో చెప్పండన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసేందుకే సీమాంధ్ర ఉద్యమమని మండిపడ్డారు. సీమాంధ్ర నాయకులన ఎవరు నమ్మడం లేదన్నారు.

బాబు దీక్ష కదిలించింది: పయ్యావుల

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆమరణ దీక్ష అందరినీ కదిలించిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ న్యూఢిల్లీలో అన్నారు. ఢిల్లీ కుట్రలను బహిర్గతం చేయడంలో బాబు దీక్ష విజయవంతమైందని చెప్పారు. జాతీయ పార్టీ నేతలను ఆలోచింపచేసిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు, కేంద్ర హోంమంత్రి దిగ్విజయ్ సింగ్‌లు తలోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. బాబు దీక్ష ద్వారా సీమాంధ్ర ఆందోళనలను జాతీయ నేతలు గుర్తించారన్నారు.

English summary
TRS senior leader Vinod Kumar said Baba Ramdev and others national leaders who met TDP chief Nara Chandrababu Naidu are Telangana supporters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X