హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ముగ్గురు మృతి
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఔటర్ రింగురోడ్డుపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్, వృద్ధ దంపతులు మృతి చెందారు.
గుంటూరు జిల్లాకు చెందిన మల్లికార్జున, భావనలు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కొద్దిసేపటి క్రితమే తమ కారులో తమ ఊరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ
వరంగల్ జిల్లాలోని నవయువకాలనీలో రమణారావు అనే వ్యాపారి ఇంట్లో భారీ చోరి జరిగింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 60 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బుధవారం సాయంత్రం రమణారావు కుటుంబంతో సహా బయటకు వెళ్లిన సమయంలో దుండగులు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇద్దరు వ్యక్తులు దోపిడీకి యత్నించారు. ఆటోలో మిర్చి బస్తాలను తరలిస్తున్న ఇద్దరిని సెక్యూరిటీ గార్డు పట్టుకుని మిర్చియార్డు కార్యాలయంలో పట్టుకున్నారు.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications