గోవిందా గోవిందా: భక్తలు తక్కువే, ఆదాయం !
తిరుమల: తిరమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం పెరిగింది. భక్తుల రద్ది సాధారణంగా ఉన్నా ఏడుకోండల స్వామి ఆదాయం మాత్రం తగ్గడం లేదు. గురువారం భక్తులు సంఖ్య తక్కువగా ఉన్నా అదాయం ఏమాత్రం తగ్గలేదు.
కేంద్ర ప్రభుత్వం నల్లధనం అరికట్టడానికి రూ.1,000, రూ.500 నోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు వెలువడిన తరువాత తిరుమల ఆదాయం పెరిగే అవకాశం ఉందని తిరుపతి తిరుమల దేవాస్థానం అధికారులు అంచనా వేశారు.
గురువారం 60,747 మంది భక్తలు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిత్యం దాదాపుగా 20 కంపార్ట్ మెంట్ల కంటే ఎక్కువగా భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వేచి చూస్తుంటారు.
అయితే భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా గురువారం శ్రీవారి హుండీకి రూ.3.53 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో భక్తుల రద్దీతో పాటు హుండీ ఆదాయం పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనావేశారు.
గురువారం 60,747 మంది భక్తలు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా గురువారం శ్రీవారి హుండీకి రూ.3.53 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో భక్తుల రద్దీతో పాటు హుండీ ఆదాయం పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనావేశారు.