Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tirupati Nagarjuna sagar ఉపఎన్నిక: ముగిసన పోలింగ్... తిరుపతిలో భారీగా తగ్గిన పోలింగ్ శాతం

అటు బెంగాల్‌లో ఐదవ విడత పోలింగ్ జరుగుతుండగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సందడి కనిపిస్తోంది. మొన్నటి వరకు ప్రచారాలతో హోరెత్తించిన అభ్యర్థులు ఇక తమ అదృష్టం ఎలాగుందో పరీక్షించుకుంటున్నారు. ఏపీలో తిరుపతి పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గారావు మృతితో అక్కడ ఉపఎన్నిక అనివార్యం కాగా... తెలంగాణలోని నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య మృతితో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగే ఉపఎన్నిక బరిలో వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ, టీడీపీ నుంచి మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ ఉన్నారు.

Tirupati, Nagarjuna Sagar By Election 2021 Live Updates: Will YSRCP hold the seat again

తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉపఎన్నిక బరిలో టీఆర్ఎస్ నుంచి నోముల భగత్ బరిలో ఉండగా, బీజేపీ నుంచి డాక్టర్ రవికుమార్, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉన్నారు. అటు తిరుపతిలో ఇటు నాగార్జున సాగర్‌లో ప్రచారం వాడీవేడీగా సాగింది. ఇక ఓటర్ల చేతిలో అభ్యర్థుల భవితవ్యం ఉంది. తిరుపతి పార్లమెంట్ మరియు నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై మినిట్-టూ- మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Apr 17, 2021, 7:08 pm IST

నాగార్జునసాగర్- తిరుపతిలో ముగిసిన పోలింగ్. మే 2న ఫలితాలు.
Apr 17, 2021, 6:58 pm IST

తిరుపతి పరిధిలో ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని కోరిన చంద్రబాబు. మంత్రి పెద్దిరెడ్డి నిబంధనలను ఉల్లంఘించారని ఫిర్యాదు
Apr 17, 2021, 6:57 pm IST

కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ అక్రమాలకు పాల్పడిందంటూ ఫిర్యాదు
Apr 17, 2021, 6:54 pm IST

సాయంత్రం 5 గంటల సమయానికి నాగార్జున సాగర్‌లో 81శాతం పోలింగ్ నమోదు
Apr 17, 2021, 6:52 pm IST

తిరుపతి నాగార్జున సాగర్ ఉపఎన్నికకు మరికొద్ది క్షణాల్లో ముగియనున్న పోలింగ్
Apr 17, 2021, 5:39 pm IST
తెలంగాణ

నాగార్జునసాగర్‌లో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు.
Apr 17, 2021, 4:29 pm IST
ఆంధ్రప్రదేశ్

అబద్దాలు పుట్టించడంలో చంద్రబాబు దిట్ట.పోలింగ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర చేస్తోంది: మంత్రి పెద్దిరెడ్డి
Apr 17, 2021, 4:29 pm IST

దొంగ ఓట్లు వేయాల్సిన ఖర్మ వైసీపీకి పట్టలేదు: మంత్రి పెద్దిరెడ్డి
Apr 17, 2021, 4:12 pm IST
ఆంధ్రప్రదేశ్

తిరుపతి

తిరుపతిలో మధ్యాహ్నం 3 గంటల సమయానికి 48 శాతం పోలింగ్ నమోదు
Apr 17, 2021, 4:05 pm IST
ఆంధ్రప్రదేశ్

తిరుపతి

తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా తిరుపతి, శ్రీకాళహస్తి అసెంబ్లీలలో బయటి ఓటర్లను వివిధ కాలేజీ బస్సుల్లో తీసుకురావడం, ఒక కోడ్ పేపర్ ను వారి చేతిలో పెట్టి, దాన్ని ఆధారం చేసుకుని ఓటు వేయమనే విధంగా ఒక ప్రణాళికను వైసీపీ నాయకులు రచించటం జరిగింది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
Apr 17, 2021, 4:04 pm IST

తిరుపతిలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభ
Apr 17, 2021, 3:49 pm IST
ఆంధ్రప్రదేశ్

అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్న ఎన్నికలు నిర్వహించడం ఎందుకు అని ప్రశ్నించిన చంద్రబాబు
Apr 17, 2021, 2:32 pm IST

తిరుపతి ఉపఎన్నికల్లో చంద్రబాబు కావాలనే డ్రామాలు ఆడుతున్నారు:వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి
Apr 17, 2021, 2:15 pm IST

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో మధ్యాహ్నం 1 గంట సమయానికి 53శాతం పోలింగ్ నమోదు
Apr 17, 2021, 1:27 pm IST

నాగార్జున సాగర్, తిరుపతి ఉపఎన్నికలో కొనసాగుతోన్న పోలింగ్. గెలుపు తమదంటే తమదేననే ధీమాతో అభ్యర్థులు
Apr 17, 2021, 12:44 pm IST

తిరుపతి నియోజకవర్గ పరిధిలో 24శాతం పోలింగ్
Apr 17, 2021, 11:40 am IST

తిరుపతి

తిరుపతి
ఓటింగ్ కి వెళ్లే ముందు తన స్వగ్రామం మన్నసముద్రం లో శనివారం కుటుంబ సమేతంగా గ్రామదేవతలకు పూజలు నిర్వహిస్తున్న తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి
Apr 17, 2021, 11:26 am IST

రాజకీయ లబ్ధికోసం వైసీపీపై అభాండాలు వేస్తున్నారు: మంత్రి పెద్ది రెడ్డి
Apr 17, 2021, 11:25 am IST

టీడీపీ కుట్రలను ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం: మంత్రి పెద్ది రెడ్డి
Apr 17, 2021, 11:24 am IST

బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను అడ్డుకుంటున్నారు: మంత్రి పెద్ది రెడ్డి
Apr 17, 2021, 11:24 am IST

దర్శనంకు వెళ్లే వారిని సైతం అడ్డుకుంటున్నారు: మంత్రి పెద్ది రెడ్డి
Apr 17, 2021, 11:23 am IST

తిరుపతి

దొంగఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతున్నారు: మంత్రి పెద్దిరెడ్డి
Apr 17, 2021, 11:15 am IST

తిరుపతిలో పోలింగ్ సరళిని సమీక్షిస్తున్న ఎస్పీ సెంథిల్ కుమార్
Apr 17, 2021, 11:04 am IST

తిరుపతిలో స్థానికులను ఓటువేయనీయడం లేదని టీడీపీ కాంగ్రెస్ ఆరోపణ
Apr 17, 2021, 11:03 am IST

తిరుపతిలో నకిలీ ఓటర్లు వచ్చారని క్యూలైన్లలో ఓటువేసేందుకు నిలబడ్డారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపణలు
Apr 17, 2021, 11:02 am IST

తిరుపతిలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చేవారిని కళ్యాణ మండపాల్లో పెట్టారంటూ టీడీపీ ఆందోళన
Apr 17, 2021, 10:55 am IST

ఉదయం 9 గంటలకు తిరుపతి పార్లమెంటులో 7.8శాతం పోలింగ్ నమోదు కాగా నాగార్జున్ సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికకు 12.8శాతం పోలింగ్ నమోదు
Apr 17, 2021, 10:19 am IST

మంత్రి పెద్దిరెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:నారా లోకేష్
Apr 17, 2021, 9:55 am IST

మంత్రి పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ నారా లోకేష్. 5వేల మంది స్థానికేతరులను తిరపతిలో టీడీపీ అడ్డుకుంది: నారా లోకేష్
Apr 17, 2021, 9:54 am IST

తిరుపతి పీఎల్‌ఆర్ కన్వెన్షన్‌ హాల్‌లో టీడీపీ ధర్నా. హాల్‌లో దొంగ ఓటర్లున్నారంటూ ఆరోపణలు
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+