Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేవుడి ముందే ఆధిపత్య పోరు.. పట్టువస్త్రాల కోసం ఎంపీ Vs ఎమ్మెల్యే

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో సోమవారం రాత్రి జరిగిన కల్యాణోత్సవం వివాదానికి వేదికైంది. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే క్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ వాతావరణం భక్తులను విస్మయానికి గురిచేసింది.

కళ్యాణోత్సవం సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ తమ కుటుంబాలతో కలిసి వచ్చారు. ఆలయ మర్యాదల ప్రకారం అధికారులు పట్టువస్త్రాలను ఎంపీ చేతికి అందించగా, తలంబ్రాలను ఎమ్మెల్యేకు ఇచ్చారు. అయితే, పట్టువస్త్రాలు తనకే ఇవ్వాలని ఎమ్మెల్యే కోరడంతో అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.

Tiruvuru MP Kesineni Chinni and MLA Kolikapudi Srinivas Rao Clash at Nemali Temple Over Protocol and Rituals

వెంటనే స్పందించిన ఎంపీ చిన్ని, వివాదం ఇష్టం లేక పట్టువస్త్రాలను ఎమ్మెల్యేకు ఇచ్చేసి నవ్వుతూ పక్కకు తప్పుకున్నారు. కానీ, ఎమ్మెల్యే వాటిని తీసుకుని వెళ్తున్న సమయంలో ఎంపీ వర్గానికి చెందిన నేత ఒకరు వాటిని లాక్కునే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, అరుపులు మొదలయ్యాయి.

రెండు వేర్వేరు వాదనలు

ఈ ఘటనపై సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి

ఎమ్మెల్యే వర్గం వాదన:

స్థానిక ఎమ్మెల్యేగా తనకు దక్కాల్సిన ప్రోటోకాల్ గౌరవం దక్కలేదని, పట్టువస్త్రాలను తనపై నుంచి బలవంతంగా లాక్కోవడం అనుచితమని వారు ఆరోపిస్తున్నారు. ఒక దళిత ఎమ్మెల్యే పట్ల ఎంపీ వర్గీయులు వీరంగం సృష్టించారని మండిపడుతున్నారు.

ఎంపీ వర్గం వాదన:

ఎంపీ చిన్ని ఎంతో సంయమనంతో వ్యవహరించారని, వివాదం తలెత్తగానే పట్టువస్త్రాలను వదిలేసి సామాన్య భక్తులతో కలిసి కింద కూర్చుని కళ్యాణాన్ని తిలకించారని వారు పేర్కొంటున్నారు. వివాదాలకు తావివ్వకుండా ఆయన హుందాగా నడుచుకున్నారని మద్దతుదారులు చెబుతున్నారు.

భక్తుల మధ్య ఎంపీ.. వేదికపై ఎమ్మెల్యే

వివాదం ముదిరిన తర్వాత ఎంపీ కేశినేని శివనాథ్ భక్తుల మధ్య కూర్చుని వేడుకను వీక్షించగా, ఎమ్మెల్యే కొలికపూడి కుటుంబంతో కలిసి వేదిక ముందు కూర్చున్నారు. ఈ క్రమంలో కూడా ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగినట్లు తెలుస్తోంది. కార్యక్రమం ముగిసిన అనంతరం ఎంపీ మీడియా పట్ల చాలా సాధారణంగా స్పందిస్తూ.. ఆలయ అభివృద్ధి గురించి, భక్తుల సౌకర్యాల గురించి మాట్లాడి వెళ్ళిపోయారు.

ఆధ్యాత్మిక వేదికపై ఆధిపత్య పోరు

నియోజకవర్గ అభివృద్ధిలో కలిసి నడవాల్సిన ఇద్దరు కీలక నేతల మధ్య ఇలాంటి విభేదాలు దేవుడి సన్నిధిలో బయటపడటంపై స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా, భక్తితో జరగాల్సిన కళ్యాణోత్సవంలో ఇలాంటి గందరగోళం చోటుచేసుకోవడం దురదృష్టకరమని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+