హైదరాబాద్ -విజయవాడ రాకపోకలు బంద్, వరద : ట్రాఫిక్ జాం, మళ్లింపు..!!
మున్నేరు పొంగి ప్రవహిస్తోంది. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ప్రవాహం జాతీయ రహదారిపైకి రావడంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం కలిగింది. జాతీయ రహదారిపై దాదాపుగా 2 కిలోమీటర్ల మేర రాకపోకలు ఆగిపోయాయి. హైవేపై వాహనాలను పలుమార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రయాణీకులు అవస్థలకు గురవుతున్నారు.
జాతీయ రహదారిపై వరద:విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా ఐతవరం గ్రామం వద్ద మున్నేరు పొంగి ప్రవహిస్తోంది. వరద ప్రవాహం జాతీయ రహదారిపైకి రావడంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం కలిగింది.జాతీయ రహదారిపై దాదాపుగా 2 కిలోమీటర్ల మేర రాకపోకలు ఆగిపోయాయి.దీంతో జాతీయ రహదారిపై వందలాది వాహనాలు ఆగిపోయాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ఒకవైపున మున్నేరు వాగు ప్రవాహ ఉద్ధృతి తీవ్రంగా ఉండడంతో.. రెండో వైపు నుంచి వాహనాలను పంపించేందుకు పోలీసులు యత్నించారు. భారీ వాహనాలను మాత్రమే అనుమతిస్తూ మిగిలిన వాటిని పోలీసులు ఆపేశారు.

రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్:నందిగామ వద్ద ఏపీ, తెలంగాణ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. మున్నేరు వాగు వరద ఉద్ధృతితో ఆర్టీసీ బస్సులను డ్రైవర్లు ఆపేశారు. చిన్న వాహనాలను నందిగామ నుంచి మధిర మీదుగా మళ్లిస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్సుల్ని దారి మళ్లించి వెళ్లేందుకు అనుమతి లేదని డ్రైవర్లు అంటున్నారు. విజయవాడ-హైదరాబాద్ మార్గంలోని ప్రయాణికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులను దారి మళ్లించారు. విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా పరిస్థితులను సమీక్షించారు. రూటు మార్చి హైదరాబాద్కు బస్సులు నడపాలని ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను కోదాడ వద్ద దారి మళ్లిస్తున్నారు.
Interim halt for vehicular movement on Vijayawada - Hyderabad as river Munneru overflowing on National highway.
— Naveen Reddy (@navin_ankampali) July 28, 2023
Since 2005 monsoon Munneru never reached up to highway, It’s been 18 year since last time.#Krishna river releases at Prakasam Barrage - 1,36,850 Cusecs pic.twitter.com/RLf2mK2mh6
రాకపోకల దారి మళ్లింపు:హుజూర్నగర్ , మిర్యాలగూడ, పిడుగురాళ్ల మీదుగా ఏపీకి వెళ్లేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సహాయం అందిస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే వాహనాలు కీసర, ఇబ్రహీంపట్నం వద్ద దారి మళ్లిస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులను గుంటూరు, పిడుగురాళ్ల, దాచేపల్లి, మిర్యాలగూడ మీదుగా నడపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
📢📢📢
— కార్తీక్ తిరుమలశెట్టి (@KaarthikTheja) July 27, 2023
Vijayawada To Hyderabad road closed due to heavy water flowing on the road at ithavaram near Nandigama...#RainAlerts pic.twitter.com/OgZIXVUewj
గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మీదుగా విశాఖ వెళ్లాలని విజయవాడ సీపీ కాంతిరాణా సూచించారు. అలాగే విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కూడా మళ్లించారు. రాజమండ్రి, గుంటూరు, పిడుగురాళ్ల, దాచేపల్లి, నార్కట్పల్లి మీదుగా వెళ్లాలన్నారు. ఇబ్రహీంపట్నం, కీసర వద్ద ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications