నంద్యాల జిల్లాలో విషాదం.. ఇంటర్ ఫెయిల్ అయ్యాడని విద్యార్ధి ఆత్మహత్య
నేడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఫలితాలను ప్రకటించారు. అయితే ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడని మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న చిన్న మస్తాన్ అనే విద్యార్థి ఇంటర్ ఫలితాల్లో ఫెయిలయ్యాడు. దీంతో మనోవేదనకు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్ధి తండ్రి పెద్ద మస్తాన్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. పిల్లాడి మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

చదువు అనేది కేవలం గ్రేడ్షీట్లు, మార్కుల కోసం కాదు. అది మనకు ఆలోచించగల శక్తిని పెంచుకోవడానికి తెలివితేటలను, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపకరిస్తుంది. ఉద్యోగం కోసం మాత్రమే చదవడం కాకుండా.. జీవితాన్ని నిర్మించేందుకు దారిచూపే సాధనంగా దాన్ని ఉపయోగించుకోవాలి. చదువు లేకపోయినా జీవితంలో గొప్ప విజయాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు. అంతే కానీ ఒకసారి పరీక్ష ఫెయిలయినందుకు జీవితానికే చెక్ పెట్టాల్సిన అవసరం లేదు. జీవితమే ఒక పరీక్ష అయితే... ఒక్క ఫెయిలుర్తో మన రిజల్ట్ ఏం మారదు. అందుకే ఆత్మవిశ్వాసంతో ఎప్పుడు ముందుకు సాగాలి. ఒక్కసారి ఫెయిల్ అయితే ఏం? మరోసారి ఎగజం రాయవచ్చు.. కానీ క్షణికావేశంలో జీవితాన్ని విడిస్తే అది కరెక్ట్ కాదని పలువురు ప్రముఖులు సైతం హితబోధ చేస్తున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications