విశాఖ జిల్లాలో పడవ బోల్తా...ఇద్దరు మృతి...నలుగురు గల్లంతు
విశాఖపట్టణం: పడవ బోల్తా పడటంతో ఇద్దరు మత్స్యకారులు మృతిచెందగా, నలుగురు గల్లంతైన ఘటన విశాఖ పట్టణం జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్.రాయవరం మండలం బంగారయ్యపాలెం వద్ద సముద్రంలో చేపలు పట్టేందుకు మత్స్యకారులు పడవలో వెళ్లారు.
అయితే పడవ కొంత దూరం ప్రయాణించిన అనంతరం బోల్తా పడటంతో ఇద్దరు మత్స్యకారులు మృత్యువాతన పడగా మరో నలుగురు గల్లంతయ్యారు. సమాచారమందుకున్న సహాయక బృందాలు మరపడవల ద్వారా ఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన వారి కోసం గాలింపు జరుపుతున్నాయి.













Click it and Unblock the Notifications