ప్రశాశం జిల్లా:కుప్పకూలిన విద్యుత్ స్థంభాలు...రైళ్ల రాకపోకలకు అంతరాయం
ప్రకాశం జిల్లా:ఎపిలో రైల్వే శాఖకు సంబంధించి పెను ముప్పు తప్పింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలో రైల్వే ట్రాక్ పై ఆరు విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రైళ్ల రాకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ సందర్భంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం వివరాల్లోకి వెళితే...
చెన్నై-విజయవాడ మార్గంలో గూడ్స్ ప్రయాణిస్తుండగా నల్లమల అటవీ ప్రాంతం పరిధిలో దిగువమెట్ట-చెలమ రైల్వేస్టేషన్ల మధ్య ట్రాక్ పై ఒక చోట రైల్వే విద్యుత్ తీగలు కిందకి జారాయి. ఈ విషయాన్ని గమనించని గూడ్స్ డ్రైవర్ రైలును ముందుకు నడిపాడు. దీంతో ఈ తీగలు గూడ్స్ పై భాగానికి తగులుకొని ఆరు విద్యుత్ స్తంభాలు నేలను పెకలించుకొని ట్రాక్ కు ఇరువైపుల చెల్లా చెదురుగా పడ్డాయి. స్థానికుల అరుపులతో అప్రమప్తమైన గూడ్స్ డ్రైవర్ రైలు నిలిపివేశాడు.

మరోవైపు ఈ ఘటన కారణంగా బెంగుళూరు-విజయవాడ రూట్ నడిచే పలు రైళ్లు నిలిచిపోయాయి. అయితే విద్యుతీకరణ పనుల్లో నాణ్యత లేకపోవడం కారణంగానే విద్యుత్ తీగలు ఇలా కిందకి జారినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణ చేపట్టింది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications