ర్యాష్ డ్రైవింగ్ వల్లే, అందుకే ఇలా చేశారు: కమిషనర్ బాలసుబ్రమణ్యం
టీడీపీ నాయకులు కేశినేని నాని రవాణ శాఖ అధికారులపై దౌర్జన్యం చేసిన ఘటనపై రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం స్పందించారు.
విజయవాడ:టీడీపీ నాయకులు కేశినేని నాని రవాణ శాఖ అధికారులపై దౌర్జన్యం చేసిన ఘటనపై రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం స్పందించారు.
ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు కింద పడి ఓ మనిషి చనిపోయారని, దీనిపై పోలీసులు తమను వివరాలు కోరారని ఆయన చెప్పారు.డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగిందని రవాణశాఖ అధికారులు నివేదిక ఇచ్చారని చెప్పారు.
వాహనంలో మెకానికల్ డిఫెక్ట్ లేదని రాసిచ్చారని చెప్పారు.పోలీసులు మళ్ళీ జన్యునిటీ సర్టిఫికెట్ కావాలని కోరితే అదికూడ ఇచ్చామన్నారు. ఈ విషయమై టిడిపి నాయకులకు అర్థం కాలేదని రవాణ శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం చెప్పారు.

తాము నిబంధనల ప్రకారంగానే పనిచేస్తున్నట్టు ఆయన చెప్పారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి ఇతర అధికారులు తనతో మాట్లాడారని బాలసుబ్రమణ్యం చెప్పారు.
ఈ తరహ ఘటనలను పునరావృతం కానివ్వబోమని ప్రభుత్వం హమీ ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు.మరో వైపు ప్రజా ప్రతినిధులు వ్యవహరించిన తీరుపట్ల రవాణా శాఖ అధికారులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారని ఆయన చెప్పారు.అయితే ఈ ఘటనపై ప్రజా ప్రతినిధులు ఆదివారం నాడు తనను కలిశారని ఆయన చెప్పారు.వారంతా వచ్చిన క్షమాపణలు కోరారని ఆయన చెప్పారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications