ముస్తాబైన తిరుమల- మరో మహోత్సవానికి శ్రీకారం: భక్తుల కోసం
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 76,506 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28,049 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.20 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 25 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పట్టింది.
తిరుమలలో ఈ నెల 26 నుండి మార్చి 2వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్రన్ నిర్వహించారు. టీటీడీ అదనపు కార్యనిర్వాహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏర్పాట్లను పరిశీలించారు. తెప్పోత్సవాల కోసం నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయిందని, తెప్పలను పూర్తిగా సిద్ధం చేసినట్టు తెలిపారు. ఇంజినీరింగ్, విద్యుత్, ఆలయ అధికారులతో కలిసి తెప్ప సామర్థ్యాన్ని పరిశీలించినట్లు చెప్పారు.

ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు శ్రీసీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై విహరిస్తారు. చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మొదటి మూడు రోజులు మూడుసార్లు, 4వ రోజు అయిదుసార్లు, చివరిరోజు ఏడుసార్లు తెప్పలపై ఉత్సవ మూర్తులు విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
కాగా తెప్పోత్సవాల కారణంగా ఈ నెల 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, 28న, మార్చి 1, 2వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గుర్తుంచుకోవాలని సూచించారు. కాగా- టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు భారీ మొత్తంలో విరాళాలు అందుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన సాతుళూరి తాండవ కృష్ణమూర్తి అనే భక్తుడు ఈ ట్రస్టుకు 10,01,116 విరాళంగా అందించారు. ఈ మొత్తంతో కూడిన డీడీని వెంకయ్య చౌదరికి అందజేశారు.
-
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
రాములవారి సేవలో శ్రీవారి సేవకులు, అరుదైన ఘట్టం - కన్నుల పండువగా..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications