తీవ్ర తుఫానుగా వాయుగుండం: ఏపీకి భారీ వర్షాలు, హెచ్చరిక జారీ
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి మరో ముప్పు పొంచివుంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి మరో ముప్పు పొంచివుంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. విశాఖపట్నంకు 1180 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాల్పూర్కు దక్షిణ ఆగ్నేయంగా 1,210 కి.మీ, పోర్ట్బ్లెయిర్కు దక్షిణ నైరుతి దిశగా 310 కి.మీ, నికోబార్ దీవులకు పశ్చిమ వాయువ్య దిశగా 260 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయు గుండం కేంద్రీకృతమై ఉంది.
మరో 48 గంటల తర్వాత ఈ వాయుగుండం తుఫానుకుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే తీరప్రాంతాల మత్స్యకారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక జారీ చేశారు.
గంటకు పది కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ వాయుగుండం తీరం సమీపానికి వచ్చేకొద్దీ క్రమంగా బలపడుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీరం వెంబడి రానున్న 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, తీరంలో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తోపాటు తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాల కారణంగా 800మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. దీంతో నావికా దళం నాలుగు ఓడలతో వారిని కాపాడేందుకు బయల్దేరింది.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications