రేవంత్ను తరిమేస్తాం: లోకేష్పై తెరాస సెటైర్, బాబుపై విజయసాయి
హైదరాబాద్/ఏలూరు: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిని తాము అసెంబ్లీలో మాట్లాడనిచ్చే ప్రసక్తి లేదని తెలంగాణ రాష్ట్ర సమితి నేత కర్నె ప్రభాకర్, గువ్వల బాలరాజులు సోమవారం అన్నారు. రేవంత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పిన తర్వాతనే మాట్లాడనిస్తామని, లేదంటే అసెంబ్లీ నుండి తరిమి కొడతామన్నారు.
ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు యాత్రలను సైతం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. హెరిటేజ్ పాలు తాగిన నారా లోకేష్.. అమూల్ బేబీలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా లోకేష్ మాట్లాడటం సరికాదన్నారు.
తెలంగాణలో మే 14న ఎంసెట్

తెలంగాణలో చదువుకోవాలంటే ఇక్కడ నిర్వహించే పరీక్షలు రాయాల్సిందేనని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్ష తేదీలను ఆయన ప్రకటించారు. మే 14న ఎంసెట్, 19న లాసెట్, 21న ఈసెట్, 22న ఐసెట్, 25న పీఈసెట్, జూన్ 6న ఎడ్సెట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏపీ కోరితే వాళ్లకు కూడా సేవలందించేందుకు సిద్ధమన్నారు.
చంద్రబాబు బండారం బయటపెడతాం: విజయ సాయి రెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మోసాలని తాము బయటపెడతామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాని కార్యదర్శి విజయ సాయి రెడ్డి సోమవారం ఏలూరులో అన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు మద్దతు తెలిపేందుకే జగన్ రెండు రోజుల దీక్షకు దిగుతున్నారన్నారు.
చంద్రబాబు మోసపూరిత విధానాలను బయటపెట్డడమే జగన్ తణుకు దీక్ష ఉద్దేశ్యమన్నారు. వెన్నుపోటు పొడవటం చంద్రబాబు వ్యక్తిత్వమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ఒక్క హామీను కూడా వారు నెరవేర్చలేదన్నారు. రైతులు, డ్వాక్రా సంఘాలు, యువత ఇలా అన్ని వర్గాలను మోసం చేశారన్నారు.
-
చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. అట్టహాసంగా గద్దర్ అవార్డ్స్ -
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం











Click it and Unblock the Notifications