తెలంగాణ ఇచ్చినా కాంగ్రెసులో విలీనం చేయం: కెసిఆర్
సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపిఎన్జీవోలు ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన సభకు ధీటుగా ఈ సభను నిర్వహిస్తున్నందున తెలంగాణసత్తా ఏమి టో చూపించాలని సూచించారు. తెలంగాణవచ్చే సమయంలో సీమాంధ్రులు ఢిల్లీలో లాబీయింగ్తో అడ్డుకోవాలని చూస్తున్నారని వారి ఆటలు సాగనిచ్చేది లేదని స్పష్టం చేశారు.
సీమాంధ్రులు రాష్ట్ర విభజన విషయంలో కాస్త వెనక్కి తగ్గినప్పటికీ రాజధాని హైదరాబాద్ను ఎట్టి పరిస్థిత్లుల్లోనూ వదులుకునేది లేద ని తెగేసి చెబుతున్నారని అన్నారు. హైదరాబాద్ నగరం కేవలం తెలంగాణ ప్రజలదేననీ, దానిపై సీమాంధ్రులకు ఎట్టి పరిస్థితుల్లోనూ హక్కు లేదని సకల జన భేరి సభతో నిరూపించాలని చెప్పారు.
హైదరాబాద్ నిజాం ప్రభువుల కాలంలోనే అభివృద్ధి చెందిందనీ, దీనికి సీమాంధ్రులు చేసింది ఏమీ లేదని అన్నారు. ఇదే విషయాన్ని ఈ నెల 29న నిర్వహిస్తున్న సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తామని తెలిపారు.