TTD: రమణ దీక్షితులపై వేటు, ఉద్యోగులకు వరాలు - బోర్డు కీలక నిర్ణయాలు..!!
Tirumala: టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. టీటీడీలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న 9వేల అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది జీతాలు పెంచుతూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయంలోని జయ విజయల వద్ద ఉన్న తలుపులకు 1.69 కోట్లతో బంగారు తాపడం చేయించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
పాలక మండలి సమావేశం: టీటీడీ పాలక మండలి సమావేశంలో భక్తుల సౌకర్యాల పెంపు పైన పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇక నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయించారు. తాళ్లపాకల్లో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

శ్రీవారి ఆలయంలోని జయ విజయల వద్ద ఉన్న తలుపులకు 1.69 కోట్లతో బంగారు తాపడానికి పాలక మండలి ఆమోదముద్ర వేసింది. రూ.4 కోట్లతో 4,5,10 గ్రాముల తాళి బొట్టులు తయారీకి నిర్ణయించిన పాలక మండలి నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. ధార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.
కీలక నిర్ణయాలు: ఇకపై ప్రతి ఏటా టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి అవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అటవీ కార్మికుల జీతాలు పెంపు..వడమాలపేటలోని ఉద్యోగుల ఇంటి స్థలాల వద్ద అభివృద్ధి పనులకు తుడాకు రూ.8.16 కోట్లు చెల్లింపుకు ఆముద ముద్ర వేసారు. రూ.3.89 కోట్లతో తిరుచానూరులో లైటింగ్ ఏర్పాటుకు నిర్ణయించారు.
అలిపిరి వద్ద ఉన్న గోశాల వద్ద రూ.4.12 కోట్లతో శాశ్వత యాగశాల నిర్మాణం పై పాలక మండలి నిర్ణయించింది. రూ.1.8 కోట్లు ఇచ్చేందుకు శేఖర్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసారు. 15 పోటు సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదన వచ్చింది. రూ.3.19 కోట్లతో సప్తగిరి అతిధిగృహం ఆధునికరణకు నిర్ణయించారు. రూ. 3.15 కోట్లతో తిరుమల్లోని జలాశయ్యాలో ఉన్న 682 మోటార్ పంపులు మార్పు చేయనున్నారు.
టీటీడీ కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగులపై టీటీడీ చైర్మన్ కరుణాకర రెడ్డి వరాల వాన
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) February 26, 2024
- చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15 వేల మందికి జీతాల పెంపు
- 3 నుండి 20వేల వరకు జీతాలు పెంచుతూ టీటీడీ బోర్డు తీర్మానం
- . ఆనందోత్సాహాలతో ఉద్యోగులు pic.twitter.com/ZgmRjpEBS4

రమణ దీక్షితుల పై వేటు: తిరుమల్లోని అతిధి గృహాలు, యాత్రి సదన్ ఎఫ్ఎంఎస్ సేవలు 3సంవత్సరాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలోని జీటీ ఆలయంలో శ్రీదేవి, భూదేవి ఉత్సవ నూతన బంగారు కవచాలు చేయనున్నారు. రూ.15 లక్షలతో తండ్లకు బంగారు తాపడం. తాగునీటి అవసరాల కోసం ముగ్గు బావి ఆధునికరణకు నిర్ణయించారు.
దీన్ని సీరియస్గా తీసుకున్న టీటీడీరమణ దీక్షితులుపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయ్యర్లపై రమణదీక్షితులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని.. ఈ కారణంగా ఆయనను టీటీడీ నుంచి తొలగిస్తూ పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి వెల్లడించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications