జంతుకొవ్వులున్నాయ్..! సీబీఐ ఛార్జిషీట్ పై టీటీడీ ఛైర్మన్..!
ఏపీలో గత వైసీపీ హయాంలో తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ చేశారని, జంతువులు, పంది కొవ్వు కలిపారని గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేయించింది. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం సిట్ తాజాగా నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే ఇందులో జంతువుల కొవ్వులు ఉన్నట్లు ఎక్కడా పేర్కొనలేదు. దీంతో వైసీపీ ఈ వ్యవహారంలో అధికార కూటమిని టార్గెట్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో టీటీడీ (ttd) ఛైర్మన్ బీఆర్ నాయుడు సీబీఐ ఛార్జిషీట్ పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెయ్యిలో జంతువుల కొవ్వులు కలవలేదని సీబీఐ ఛార్జిషీట్ లో ఎక్కడా చెప్పలేదని ఆయన వెల్లడించారు. శ్రీవారి లడ్డూల తయారీలో ప్రాణాంతక రసాయనాలు వాడారని ఆయన ఆరోపించారు. కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్డూలు తయారు చేసారని పేర్కొన్నారు. నెయ్యిలో నూటికి నూరు శాతం కల్తీ జరిగిందని బీఆర్ నాయుడు వెల్లడించారు.

గతంలో టీటీడీ ఛైర్మన్ ముఠామేస్త్రి సహకారం లేకుండా ఇవన్నీ చేయగలరా అంటూ జగన్ ను కూడా ఆయన టార్గెట్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి పీఏ ఖాతాలో కోట్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఆ ఖాతా నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్లాయో సీబీఐ వెల్లడించాలంటూ మరో కొత్త డిమాండ్ కూడా చేశారు. కల్తీ నెయ్యి అక్రమాల వెనుక ఉన్న వారి పేర్లు సీబీఐ బయటపెట్టాలంటూ బీఆర్ నాయుడు కోరారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రాకపోతే కల్తీ నెయ్యి దందా ఇప్పటికీ కొనసాగేదన్నారు. మరోవైపు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు సీబీఐ ఛార్జిషీట్ లో లేదని జాతీయ మీడియా సైతం చెప్తున్నా బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications