Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD:వారికి ఇక అరగంటలోనే దర్శనం - టోకెన్ల జారీలో తాజా మార్పులు..!!

Tirumala: టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వేసవి రద్దీకి అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేసింది. వేసవి సెలవులు పూర్తయ్యే వరకూ సిఫారసు లేఖలు పరిమితం చేయాలని నిర్ణ యించింది. ఇదే సమయంలో వృద్ధులకు.. దివ్యాంగుల దర్శనంలో మార్పుల చేస్తోంది. టోకెన్ల జారీ విధానంలోనూ పాత విధానం పునరుద్ధరించాలని డిసైడ్ అయింది. టీటీడీలో సంస్కరణల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

టీటీడీ నిర్ణయాలు
తిరుమల శ్రీవారి దర్శనం లో టీటీడీ వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక నుంచి వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తొలగించి.. శీఘ్రంగా దర్శనం జరిగేలా నిర్ణయం తీసుకుంది. వీరికి ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే దర్శన టోకెన్లను జారీ చేస్తున్నారు. ఇప్పుడు తాజా నిర్ణయం మేరకు పాత ఆఫ్‌లైన్‌ విధానాన్ని కూడా పునరుద్ధరించాలని నిర్ణయించింది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆఫ్‌లైన్‌ టోకెన్ల ద్వారా కూడా దర్శన భాగ్యం లభించనుంది. 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులతో పాటు శారీరక, మానసిక వైకల్యం.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న భక్తులకు టీటీడీ కోవిడ్‌ ముందు వరకు రోజుకు 1,400 మందికి దర్శనం అవకాశం కల్పించేవారు.

TTD Decided to re introduce the offline token system for Senior citizens soon

పాత విధానం పునరుద్దరణ
వీరికి గతంలో తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉండే కౌంటర్ల ద్వారా ఉదయం 10 గంటల స్లాటుకు 700 మందికి, మధ్యాహ్నం 3 గంటలకు 700 మందికి కరెంట్‌ బుకింగ్‌ ద్వారా టోకెన్లు ఇచ్చేవారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలతో పాటు ఈ విధానాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత 2021 ఏప్రిల్‌ 9 నుంచి పునరుద్ధరించారు. కాగా, టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడం, కొవిడ్‌ సమయంలో పెరుగుతున్న రద్దీ కారణంగా కరెంట్‌ బుకింగ్‌ను అప్పట్లో రద్దు చేశారు. అప్పటి నుంచి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల తరహాలో ఈ టోకెన్లను ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకోవాలనే నిబంధన పెట్టారు. ఉదయం 10 గంటల స్లాట్‌ను రద్దు చేసి, మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌కు మాత్రమే వెయ్యి టోకెన్లు జారీ చేస్తున్నారు.

Take a Poll

ఆఫ్ లైన్ లో టోకెన్లు
అయితే, ఈ క్రమంలో ఎలాంటి దర్శన టికెట్లు, టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు సర్వదర్శనం క్యూలైన్‌లోకి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీంతో, గత నెల 24న జరిగిన బోర్డు సమావేశంలో ఆఫ్ లైన్ లోనూ టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించారు. కాగా, రానున్న 3 నెలలకు సీనియర్‌ సిటిజన్ల టోకెన్ల జారీప్రక్రియ ఆన్‌లైన్‌లో పూర్తయింది. ఆ తర్వాత ఆఫ్‌లైన్‌ విధానం అమలు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రోజుకు ఎన్ని టోకెన్లు ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలనేది ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేయనున్నారు. ఇదే సమయంలో బ్రేక్ దర్శనాల్లోనూ మార్పుల పైన టీటీడీ కసరత్తు చేస్తోంది. గతంలో అమలు చేసిన విధంగా ఉదయం 5.30 గంటల నుంచి ప్రారంభిచేలా రానున్న శని, ఆదివారాల్లో టీటీడీ ట్రయల్‌ రన్‌ నిర్వహించనుంది.

బ్రేక్ దర్శనాల్లో మార్పు
కాగా, రాత్రివేళల్లో కంపార్టుమెంట్లలో వేచిఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో వీఐపీ బ్రేక్‌ను ఉదయం 10.30 గంటలకు మార్చారు. ఈ విధానంపై పలువురు వీఐపీల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఉదయం కల్యాణోత్సవం, ఉదయం టైంస్లాట్‌లు కలిగిన రూ.300 ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణాలతో వీఐపీ బ్రేక్‌ను తిరిగి పూర్వపుపద్ధతిలో వేకువజాము 5.30 గంటలకే ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 30వ తేదీ వరకు సిఫార్సు లేఖలపై ఇచ్చే బ్రేక్‌ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇక.. బుధవారం టీటీడీ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. తిరుమలలో భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనపైనా నిర్ణయం తీసుకోన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+